డార్లింగ్ సినిమాలంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనంటారు ఆయన ఫ్యాన్స్. బాహుబలి 1, బాహుబలి 2 తో ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. దానితరువాత విడుదలైన మన డార్లింగ్ ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో తీసిన సినిమా సాహో.. ప్రభాస్ నటించే సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊహించుకుంటారు.
అందుకు తగ్గట్టే ఉంటాయి మిర్చి ప్రభాస్ మూవీలు. కాని సాహో మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా భారీగానే కలెక్షన్లను వసూలు చేసిందనుకోండి. కలెక్షన్లలోనూ, ఇటు టీఆర్పీ లోనూ ముందువరసలో ఉండేవి మాత్రం మన మిర్చి ప్రభాస్ సినిమాలే.. కాని సాహో మాత్రం అందుకు విరుద్దంగానే ఉందని చెప్పుకోవచ్చు..
టెలివిజన్ లో సాహో మొదటి సారిగా కోటి 38 లక్షల వ్యూవర్ షిప్ సాధించింది. కాగా రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు 52 లక్ష వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సాహో చిత్రాన్ని రీసెంట్ గా టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రం 5.8 టీఆర్పీ రేటింగ్ ను సాధించింది.
దీంతో ఛానెల్ యాజమాన్యం, అభిమానులు కళ్లు తేలేసారు. అదే రోజు వేరే ఛానెల్ లో కార్తికేయ నటించిన గుణ 369 చిత్రం రాగా ఆ చిత్రానికి 5.9 టీఆర్పీ రేటింగ్ దక్కింది. అంటే జనాలు సాహో కన్నా గుణ 369 మూవీనే ఎక్కువగా చూశారు. అంటే పెద్ద భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.