Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” మార్చి 11 వ తారీకు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా… ఒమిక్రన్ వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదు కావడంతో దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సినిమా వాయిదా పడడం జరిగింది. అయితే ప్రస్తుతం కేసులు తగ్గిపోవటంతో పాటు వైరస్ ప్రభావం ఎక్కడ లేకుండా ఉండటంతో మళ్లీ నార్మల్ పరిస్థితి రావడంతో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
దీనిలో భాగంగా మార్చి 11 వ తారీకు “రాధేశ్యాం” విడుదల సందర్భంగా ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాలలో… గతానికి భిన్నంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సినిమా గురించి అనేక విషయాలు తెలియ చేస్తూనే తన ప్రైవేట్ లైఫ్ విషయాలు కూడా మీడియాతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమాలు చాలా స్లోగా చేస్తున్నట్లు అభిమానుల నుండి టాక్ వస్తున్న తరుణంలో.. ప్రభాస్ ఈ విషయానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
రాబోయే రోజుల్లో ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల అయ్యేలా పని చేస్తానని మాట ఇచ్చారు. దాదాపు సంవత్సరానికి 300 రోజులు అభిమానుల కోసం పనిచేస్తానని తెలియజేశారు. ఇప్పటి వరకు సినిమాలు స్లోగా చేసినందుకు క్షమించాలని.. అయినా కానీ సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని డార్లింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్, మారుతి.. దర్శకత్వలో సినిమాలు ఒప్పుకోవడం జరిగింది వీటిలో మూడింటిలో.. షూటింగ్ లలో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే మార్చి 11 వ తారీకు “రాదే శ్యాం” విడుదల నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.