ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరో అద్భుతమైన ప్లాట్ దొరికింది.మరో రక్త చరిత్ర లాంటి సినిమా తీయడానికి అనువైన కథాంశం ఆయనకు అందుబాటులోకొచ్చింది.
క్రైమ్ సినిమాలు తీయడంలో పేరొందిన వర్మ ఒక్కడే ఈ కథకు కూడా న్యాయం చేయగలడని చెప్పటం అతిశయోక్తి కాదు.రియల్ స్టోరీ ప్లాట్లను వెతుక్కునే వర్మకు ఇదో అద్భుతమైన అవకాశం.కరుడుగట్టిన ఉత్తర ప్రదేశ్ రౌడీ షీటర్ వికాస్ దుబే చిత్రాన్ని సినిమాగా తీస్తే గనుక కాసుల వర్షం కురవడం ఖాయమంటున్నారు.ఇంతకూ వికాస్ దూబే ఎవరు!ఆయన స్టోరీ ఏమిటంటే…
అతను తాజాగా ఒక డీఎస్పీతో సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు. అంతకుముందు మంత్రితోపాటు రాజకీయ నాయకులు ప్రత్యర్థులను అతి దారుణంగా చంపి మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ గా యూపీలో వికాస్ దూబే ఫేమస్ అయ్యాడు.కరుడుగట్టిన నేరచరిత్రను ఒకసారి తవ్వి చూస్తే అతని మీదహత్యలు దోపిడీలు లూటీలు రేప్ లు కిరాయి హత్యల వంటి 65కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. యూపీలోని పంచాయితీ ఎన్నికల్లో గెలిచి రౌడీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2001లో యూపీకి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు నాటి మంత్రి సంతోష్ శుక్లాను అతిదారుణంగా హత్య చేశాడు. అధికారంలో ఉన్న మంత్రి హత్యతో దేశవ్యాప్తంగా ఈ నేరస్థుడి పేరు చర్చనీయాంశమైంది. వికాస్ దూబే సాక్షులను బెదిరించడంతో ఎవరూ సాక్షం చెప్పకపోవడంతో మంత్రిని హత్య చేసినా న్యాయస్థానంలో నిర్ధోషిగా బయటకు వచ్చాడు.
విద్యాసంస్థలు మామూళ్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ కాలేజ్ మేనేజర్ ను చంపేశాడు. తనను ఎదురించిన అందరినీ చంపేశాడు. గ్యాంగులను తుదముట్టించాడు. 2018లో సమీప బంధువు అతడి ముఖ్య అనుచరులు నలుగురిని చంపేశాడు.
2000లో రాజకీయ నాయకుడు రామ్ బాబు యాదవ్ హత్య కేసులో వికాస్ జైలుకెళ్లాడు. ఆ సమయంలోనే జైల్లోనే ఉండి సమీప బందువు ఎదురు తిరిగినందుకు దినేష్ దూబేనే చంపించాడు. యూపీని గడగడలాడిస్తున్న వికాస్ దూబేను తాజాగా పట్టుకోవడానికి 8 మంది పోలీసులు రాగా వారిని అతిదారుణంగా కాల్చి చంపేశాడు.మంత్రిని పోలీసు ఉన్నతాధికారినే లేపేసిన వికాస్ దూబేది మంచి మసాలా వంటి కథాంశం కాదా?