Rashmika Mandana: రష్మిక మందన క్రేజ్ ఉన్న కొద్ది డబల్.. త్రిబుల్ అవుతుంది. “పుష్ప” సినిమా విజయంతో ఈ కన్నడ భామ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా పెరిగిపోయింది. ఊహించని విధంగా అదృష్టం నక్క తోక తొక్కినట్లూ… రష్మిక ఇప్పుడు సౌత్ మొదలుకొని నార్త్ వరకు సత్తా చాటుతోంది. ముఖ్యంగా శ్రీవల్లి పాటతో వారి గుర్తింపు దక్కించుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ముద్దుగుమ్మ “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే హీరోయిన్ గా కాకుండా ఒక స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన నీ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ అనే సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మిక మందన కి సందీప్ రెడ్డి వంగా అవకాశం ఇచ్చినట్లు టాక్. “అర్జున్ రెడ్డి” సినిమా హిట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
అర్జున్ రెడ్డి సినిమా హిందీలో షాహిద్ కపూర్ ని హీరోగా పెట్టి “కబీర్ సింగ్” గా.. కరెక్ట్ ఎక్కించటం జరిగింది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రష్మిక మందన కి స్పెషల్ సాంగ్ సందీప్ రెడ్డి వంగ కేటాయించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. బాహుబలి అదేవిధంగా పుష్ప సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో బాలీవుడ్ టాప్ హీరోలు ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ కి చెందినా దర్శకులతో హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనిలో భాగంగా పుష్ప లో… రష్మిక మందన డాన్స్ వేసిన శ్రీవల్లి పాట సాంగ్… దేశవిదేశాలలో సత్తా చాటడంతో.. ఈ అవకాశం ఆమెకు వచ్చినట్లు సమాచారం.