Goodbye: “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పొజిషన్ లోకి వెళ్లిపోయింది. రెండో సినిమా విజయ్ దేవరకొండతో నటించిన “గీతాగోవిందం”తో తెలుగు కుర్రకారు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప”లో హీరోయిన్ గా చేసి ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా.. తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకోవడం తెలిసిందే. “పుష్ప”లో రష్మిక మందన వేసిన స్టెప్పులు చాలా వైరల్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్…, “నా సామి” పాటలలో రష్మిక వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు వేసి మంచి ఆదరణ దక్కించుకున్నారు.
దీంతో ఈ కన్నడ బ్యూటీకి బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది వరకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. హిందీలో వికాస్ బల్ దర్శకత్వంలో అమితా ప్రధాన పాత్రలో నటించిన “గుడ్ బై” సినిమాలో కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 7వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా గురించి.. రష్మిక మందన మాట్లాడుతూ కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన స్టోరీ అని తెలిపింది. విశ్వాసాలు ఆచార వ్యవహారాలని ప్రశ్నిస్తున్నే … భావోద్వేగాలను అర్థం చేసుకునే యువతిగా.. తారా భల్లా పాత్ర పోషించినట్లు తెలిపింది.
అయితే కన్నడ మాతృభాష కావడంతో అమితాబ్ సినిమాకి డబ్బింగ్ చెప్పటంలో చాలా కష్టం అనిపించిందని పేర్కొంది. కానీ హిందీ భాష ట్రైనింగ్ తీసుకోవడంతో… రాను రాను సులువు అయిపోయింది విజయవంతంగా “గుడ్ బై” కి సొంతంగా హిందీ డబ్బింగ్ చెప్పినట్లు రష్మిక మందన తెలిపింది. ప్రస్తుతం రష్మిక మందన చేతిలో “పుష్ప 2″తో పాటు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న NTR30 ఉన్నట్లు సమాచారం.