యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్కు, సినీ అభిమానులకు ఈరోజు గుడ్ న్యూస్ చెబుతానని అన్నాడు. అన్నట్లుగానే ఆయన `సాహో` సినిమాకు సంబంధించిన మరో లుక్ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడం విశేషం. `డార్లింగ్స్ మీ కోసం నా నెక్ట్స్ మూవీ `సాహో`కు సంబంధించిన కొత్తపోస్టర్. ఆగస్ట్ 15న మిమ్మల్నందరినీ థియేటర్స్లో కలుస్తాను` అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఇప్పటికే విడుదలైన రెండు యాక్షన్ ప్రోమోస్ షేడ్స్ ఆఫ్ సాహో 1,2లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా.. ఇప్పుడు విడుదలైన పోస్టర్ మరింత ఊతమిచ్చింది.
`బాహుబలి` తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా `సాహో` కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. అందుకు తగినట్లు నిర్మాతలు మూడు వందలకోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. మరి సాహోగా ప్రభాస్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.