ఎప్పుడైనా మనం దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మనకు అసౌక్యర్యం కలగకుండా జాగ్రత్తలు పడుతుంటాం. సెలబ్రిటీల విషయానికి వస్తే.. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో బస
చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ స్టార్ హోటల్స్ సదరు సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇప్పుడు హీరోయిన్ మీరా చోప్రాకు అలాంటి ఓ చేదు అనుభవం
ఎదురైంది. గుజరాత్ రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన అహ్మదాబాద్లో డబుల్ ట్రీ హెల్టన్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. ఇందులో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ తీరా వచ్చిన
ఫుడ్ చూసి ఆమె షాకైంది. అందుకు కారణం ప్లేట్లో ఫుడ్తో పాటు తెల్ల పురుగులు కూడా ఉన్నాయి. దీంతో ఆమె వెంటనే తన మొబైల్ ద్వారా దాన్ని వీడియో తీసి తన
ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. ఎంతో డబ్బులు చెల్లించి ఇంత పెద్ద హోటల్స్కి వస్తే వారు నిరక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీరాచోప్రా. పవర్స్టార్
పవన్కల్యాణ్ ‘బంగారం’ చిత్రంలో మీరా చోప్రా ప్రధాన పాత్రలో నటించింది.
previous post