YS Jagan Mahesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధర విషయంలో పెంచుకునే రీతిగా కొత్త జీవో జారీ చేయటంతో ఇండస్ట్రీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న సినిమా బతికే విధంగా పెద్ద సినిమాకి లాభాలు వచ్చే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త జీవో తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే రీతిలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించినట్లు ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఇదే సమయంలో.. ఇండస్ట్రీకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా గా పనిచేసిన.. మంత్రివర్యులు పేర్ని నాని కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరియు ప్రభుత్వానికి మధ్య మరింత సంబంధాలు బలపడేలా ముందుకు సాగుతామని.. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే మహేష్ నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట మే 12 వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి ముందే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.. “సర్కారు వారి పాట” నిర్మాతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది.
గతంలోనే మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఇండస్ట్రీ సమస్యల గురించి టికెట్ ధరలు గురించి మహేష్ .. సీఎం జగన్ తో భేటీ కావడం తెలిసిందే. ఆ సమయంలో టికెట్ ధర గురించి ఇంకా ఇండస్ట్రీ గురించి మహేష్ తనదైన శైలిలో.. జగన్ తో మాట్లాడారు. జగన్తో భేటీ తర్వాత కచ్చితంగా ఏపీ ప్రభుత్వం.. ఇండస్ట్రీ సమస్యలు మరియు టికెట్ ధరలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు.. నమ్మకం ఉందని త్వరలోనే శుభవార్త వింటారు అని మీడియా ముందు మహేష్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో…సరి కొత్త జీవో ఏపీ ప్రభుత్వం తీసుకు రావడంతో మహేష్ సంతోషం వ్యక్తం చేశారు