టెలివిజన్ రంగంలో జబర్దస్త్ అనే కామెడీ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సుడిగాలి సుధీర్ ప్రస్తుతం రాణిస్తున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా అనేక కష్టాలు ఎదుర్కొని స్టేజిపై అందరిని నవ్విస్తూ అలరిస్తూ తన అమాయకత్వపు చేష్టలతో కామెడీ పంచ్ డైలాగులతో చాలామంది అభిమానాన్ని సంపాదించడం జరిగింది. ఒకపక్క టెలివిజన్ రంగంలో షోలు చేస్తూనే మరోపక్క ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు కూడా సుధీర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోతో పాపులేరైనా చాలామందిలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సుధీర్ కే ఉంది. సోషల్ మీడియాలో సైతం సుడిగాలి సుదీర్ అభిమానుల హవా కొనసాగుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల “వాంటెడ్ పండుగాడు” ప్రీ రిలీజ్ వేడుక కి సుడిగాలి సుదీర్ రావటం జరిగింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. అయితే అదే టైంలో వేదికపై సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఉండటం జరిగింది. అనసూయ మాట్లాడుతున్న సమయంలో సుధీర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా మాయకు అందుకున్న రాఘవేంద్రరావు గోల చేస్తున్న సుధీర్ అభిమానులపై శ్రీరస్తు వ్యాఖ్యలు చేశారు. అందరూ సైలెంట్ గా ఉండండి. చెప్పేది వినండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు కదా.. అని గట్టిగా హెచ్చరించారు.
ఇక ఇదే సమయంలో సుడిగాలి సుదీర్ సైతం అభిమానులను సైలెంట్ గా ఉండాలని సైగాల్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సైలెంట్ గా కనబడే రాఘవేంద్రరావు అందరి ముందు ఒక్కసారిగా స్టేజిపై సుధీర్ అభిమానులపై సీరియస్ అవ్వటం సంచలనం రేపింది. రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్”. ఆగస్టు 19వ తారీకు రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతున్న క్రమంలో.. సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చిన టైంలో ఒక్కసారిగా గోల చేయడంతో.. ఈ రీతిలో రాఘవేంద్రరావు రియాక్ట్ అయ్యారు.