“ది కార్గిల్ గర్ల్” సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ మెయిన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటిసారిగా జాయిన్ అయిన గుంజన్ సక్సేనా పాత్రల ఆధారంగా తీసుకొని సినిమా చేయడం జరిగింది. కాగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఐఎఎఫ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డుకు ఐఎఎఫ్ సంస్థ లెటర్ రాయడం జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా “ది కార్గిల్ గార్ల్” సినిమా పై మెయిన్ రియల్ క్యారెక్టర్ గుంజన్ సక్సేనా సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇటీవల గుంజన్ సక్సేనా తో కలిసి పైలట్ శిక్షణ పొందిన మాజీ వింగ్ కమాండర్ నమ్రిత చాంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో చూపిస్తున్నది, రియల్ కాదని అంతా ఫేక్ అని ధ్వజమెత్తారు. అబద్ధాలు చూపించి డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటూ సినిమా యూనిట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతేకాకుండా గుంజన్ సక్సేనా లెటర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో ఐఎఎఫ్ ని అవమాన పరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని, సినిమాలో చూపిస్తున్నట్టు వాయుసేనకు చెందిన ఏటువంటి అధికారి ఆ రీతిగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఎంతో గొప్పదైనా బ్లూ యూనిఫామ్ ను ధర్మ ప్రొడక్షన్స్ సినిమాల్లోనూ దిగజార్చి చూపించిందని, ఇది దారుణం అని గుంజన్ సక్సేనా మండిపడ్డారు.