సహజముగా తెల్లవారుజామునే నిద్రలేవడం చాల మంచి అలవాటు. ఈ అలవాటును ఎప్పుడూ పాటించేవారికి ఎటువంటి చెడు ప్రభావాలకు గురికారు.
ఉదయాన్నే కళ్లు తెరవగానే రెండు చేతులను జోడించాలి. అరచేతులు చూస్తూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. “కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందహా ప్రభాతే కరదర్శనం” అనే మంత్రాన్ని తప్పక పఠించాలి. అరచేయి పై భాగాన లక్ష్మి, మధ్యభాగములో సరస్వతి, చివరి భాగంలో గౌరీ దేవి, అమ్మవార్లు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి.
పై మంత్రాన్ని చదువుకుని చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళను తెరుస్తూ అరచేతులను చూసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు వృద్ధిని పొందుతారు. మనల్ని మోస్తూ , మనం ఎం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూ మాతకు కృతజ్ఞతగా ఉదయాన్నే నిద్రనుండి లేచిన తర్వాత మన పాదం భూమిపై పెట్టె సమయంలో భూమికి కూడా మస్ఫూర్తిగా నమస్కరించడం మంచి పద్దతి.
ధర్మ శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుండి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని నమ్ముతూ ఉంటారు. దాని ఫలితంగా జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని ఎంతో మంది నమ్ముతారు. అంత ఎందుకు మనకి ఎవ్వరైనా సహాయం చేస్తే వెంటనే థాంక్స్ చెప్తాము … అలాంటిది మనలని మోస్తున్నందుకు కృతజ్ఞతగా భూమాతకు మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది కేవలం నమస్కరించడం మాత్రమే.
అంతేకాదు పొద్దునే లేస్తూనే మన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ సమస్త ప్రాణకోటిని కాపాడమని అందరికి మంచిజరగాలని కోరుకోవాలి. ఆలా అందరి బాగు కోరుకోవడం వలన మీ రోజంతా ఎంతో ఆనందం గా గడుస్తుంది .