కరోనా మహమ్మారికి సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో.. ఇమ్యునిటీని పెంచుకోవడం మాత్రమే సరైన మార్గమని, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెప్తున్నారు. వైరస్ మన శరీరంలోకి రాకుండా ఉండాలంటే, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.
ఈ ఇమ్యునిటీ పెంచడం లో ఆహారం తో పాటు నిద్ర కూడా ఒక భాగమట. అవును మరి సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతాయట. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి ఇవే. కాబట్టి నిద్ర తక్కువయ్యే కొద్దీ ఒంట్లో వైరస్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నా మాట. కరోనా సోకినా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండండి.
అలా భయపడడం వలన ఒత్తిడి పెరిగి ఇమ్మ్యూనిటీ దెబ్బతిని వైరస్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది . వైరస్ దరి చేరకుండా ఉండేందుకు.. రోజుకీ ఎనిమిది గంటల పాటు ప్రశాంతం గా నిద్రపోండి. అలా ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత మంచిదట. ఇక ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు అంటారా… అయితే ఇలా చేసిచూడండి.
ఉదయాన్నే 9 గం లోపు కాసేపు ఎండలో ఉండండి. దీనివలన రోజంతా చలాకిగా ఉంటారు. రాత్రి సమయం లో నిద్ర బాగా పడుతుంది. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్ర కు అది ఆటంకమును కలిగిస్తుంది . రాత్రి బాగా నిద్రపోవడమే మనిషి ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలు కూడా తాగడం తగ్గించడం తో పాటు, రాత్రి భోజనంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
ఇక నిద్రపోయే ముందు పాలు లేదా మజ్జిగ తాగితే నిద్ర బాగా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక వ్యాయామం, యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, మంచి నిద్రని ఇవ్వడం తో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.