Samantha: మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో సమంత పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకినట్లు నిన్న మధ్యాహ్నం సమంత పెట్టిన పోస్ట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మయోసిటీస్ వ్యాధి తీవ్రత మరియు చికిత్స గురించి సమంత అభిమానులు ఇంటర్నెట్ లో తెగ సర్చ్ చేస్తున్నారు. మరోపక్క భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు అక్కినేని ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయి సమంతకి ధైర్యం చెబుతూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే సమంత అనారోగ్యం పోస్టుపై చిరంజీవి ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమయానకూలంగా కొన్ని సవాళ్లు మన జీవితాల్లో ఎదురవుతాయి. మనలో అంతర్గత శక్తిని తెలుసుకోవడానికి ఇటువంటి సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. నువ్వు ఎంతో అందమైన అమ్మాయివి. నీకు ఆత్మస్థైర్యం కూడా చాలా ఎక్కువ. కచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నువ్వు ఈ అత్యంత సవాలకరమైన పరిస్థితి నుండి త్వరలోనే బయటపడతావు.. అని కోరుకుంటున్నాను.
సమంత ధైర్యంగా ఉండాలని ఆశిస్తూనట్లు చిరంజీవి ట్విట్టర్ లో ఈ రీతిగా సమంతా అనారోగ్యం పోస్ట్ పై రియాక్ట్ అయ్యారు. సమంత ప్రస్తుతం “యశోద” అదే విధంగా విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమాలు చేస్తోంది. వీటిలో నవంబర్ 11 వ తారీకు “యశోద” విడుదల కానుంది. “ఖుషి” వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే “ఖుషి”కి సంబంధించి సమంత తన పాత్ర మొత్తం కంప్లీట్ చేశాక ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కోరుకుంటున్నారు.