సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉండటం ఈ మధ్య కామన్గా జరుగుతున్న విషయమే. కమర్షియల్ డైరెక్టర్స్ ఈ విషయంలో పర్టికులర్గా ఉంటారు. అలాంటి కమర్షియల్ డైరెక్టర్స్లో ఒకడైన అనిల్ రావిపూడి సూపర్స్టార్ మహేశ్తో `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో మాత్రం రెండు స్పెషల్ సాంగ్స్ను ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. సినీ వర్గాల సమాచారం మేరకు ఓ స్పెషల్ సాంగ్లో తమన్నా తళుక్కంటే.. మరో సాంగ్లో మరో స్టార్ హీరోయిన్ మెరవనుందట. ఈ రెండు స్పెషల్ సాంగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి హుక్ లైన్స్తో మ్యూజిక్ అందించాడట. `సరిలేరు నీకెవ్వరు` మహేశ్ 26వ సినిమా. ప్రస్తుతం సినిమా కేరళ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా విజయశాంతి, ప్రకాష్రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
next post