సీనియర్ తమిళ నటుడు రాధారవి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై పెను దుమారమే రేగింది. పలువురు రాధారవి ప్రవర్తనను తప్పు పట్టారు. దానిపై రాధారవి స్పందిస్తూ ‘నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’ అన్నారు. అయితే ఇప్పుడు ఆయన తన మాట మార్చారు. నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? అని ప్రశ్నిస్తున్నారు. నేనెమైనా క్షమించరాని నేరం చేశానా? ఈరోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నట్లే ఆరోజు కూడా కొట్టారు. నేను నిజం మాట్లాడాను కాబట్టి నాకు మద్దతు పలికారు. నెనెందుకు భయపడాలి. నేను నటించలేనని కొందరు అంటున్నారు. సినిమాల్లో కాకపోతే నాటకాల్లో నటిస్తాను. అప్పుడేం చేస్తారు? నా మాటల్లో నిజం ఉంటే ఒప్పుకోండి.. లేకపోతే వదిలేయండి” అన్నారు. ఇప్పుడు రాధారవి చేసిన వ్యాఖ్యలపై మళ్లీ ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
……………
previous post
next post