Prabhas: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పేరు మారుమొగుతుంది. మొదటి సినిమా “అర్జున్ రెడ్డి” తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి మొదటి సినిమాతోనే సందీప్ రెడ్డి.. అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో “కబీర్ సింగ్” గా తెరకెక్కించి అక్కడ కూడా విజయాన్ని అందుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇటీవల రణబీర్ కపూర్ తో “యానిమల్” సినిమా చేసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. “యానిమల్” సినిమా వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. “యానిమల్” చూసిన చాలామంది సినిమా సెలబ్రిటీలు సందీప్ రెడ్డి వంగా.. పనితనం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు చిన్న పాత్రలు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రధాన హీరోయిన్ రష్మిక మందన సినిమా మొత్తంలో చాలాసేపు కనిపించిన గాని ఆమెకు తగ్గట్టుగానే కొంతసేపు కనిపించిన మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రికి మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. రణబీర్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాలతో.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో త్రిప్తి డిమ్రికి సోషల్ మీడియాలో ఊహించని విధంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. “యానిమల్” సినిమా విడుదలకు ముందు కేవలం వేలలో ఉండే ఫాలోవర్స్ ఇప్పుడు.. రెండు మూడు మిలియన్లు దాటేసి ఇంకా పెరుగుతూ ఉంది. సినిమా చూసిన చాలామంది రణబీర్ కపూర్ తో త్రిప్తి డిమ్రి.. చేసిన సన్నివేశాలు గురించి చర్చించుకుంటున్నారు.
సో అంత క్రేజ్ అనేది త్రిప్తి డిమ్రికి “యానిమల్” తో లభించింది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్… పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెల నుండి సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” సినిమాలో కూడా..త్రిప్తి డిమ్రికి అవకాశం ఇవ్వడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. “యానిమల్” సినిమాకి గాను ఈ ముద్దుగుమ్మకు వచ్చిన క్రేజ్.. బట్టి పెట్టుకోవాలని సందీప్ రెడ్డి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక త్రిప్తి డిమ్రి.. మాత్రమే కాదు “యానిమల్” సినిమాలో బాగా హైలైట్ అయిన చాలా పాత్రలకు సంబంధించిన నటీనటులను “స్పిరిట్” సినిమాలో రిపీట్ చేయబోతున్నట్లు సమాచారం.