Neha Sharma: సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తమీ కాదు. గత కొన్ని తరాల నుంచి ఎంతో మంది నటీనటులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జాబితాలో ఇప్పుడు చిరుత హీరోయిన్ నేహా శర్మ కూడా చేరబోతోంది. బీహార్ లోని భాగల్పూర్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త అజిత్ శర్మకు జన్మించిన నేహా శర్మ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2007లో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుతతోనే నేహా శర్మ కూడా నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత కుర్రాడు అనే చిత్రంలో కనిపించి టాలీవుడ్ లో కనుమరుగైన నేహా.. బాలీవుడ్ లో బిజీ అయింది. అక్కడ వరుస చిత్రాల్లో నటించింది. మలయాళ, పంజాబీ, తమిళ భాషల్లోనూ అడపా తడపా చిత్రాల్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ ఫిల్మ్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇలాంటి తరుణంలో నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తండ్రి, కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తాజాగా తెలిపారు.
లోక్సభ ఎన్నికల బరిలో నేహా శర్మ దిగే అవకాశాలు ఉన్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి. బీహార్ నుంచి ఆమె పోటీ చూసే సూచనలు కనిపిస్తున్నాయి. నేహా తండ్రి అజిత్ శర్మ కాంగ్రెస్ పార్టీ తరఫున బీహార్లో భాగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీహార్ నుంచి తన కూతురు నేహా శర్మను లోక్సభ బరిలోకి దింపాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇదే విషయంపై అజిత్ శర్మ హిట్ కూడా ఇచ్చారు. `ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కు భాగల్ పూర్ నియోజకవర్గం దక్కాలని నేను కోరుకుంటున్నా. అది మాకు కంచుకోట. ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ భాగల్పూర్ లోక్సభ సీటు కాంగ్రెస్కు వస్తే.. నేను పోటీ చేస్తాను. లేదా నా కూతురు నేహా శర్మ బరిలోకి దిగుతుంది. ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకం అండ్ పై ఆధారపడి ఉంది` అని అజయ్ శర్మ తాజాగా మీడియాతో పేర్కొన్నారు. కాగా, బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఈ వారంలో ఇండియా కూటమి సైతం సీట్ల భాగస్వౌమ్య ప్రకటన రావొచ్చని అంటున్నారు.