Madhuranagarilo April 1 2024 Episode 327: మధుర శ్యామ్ ను చూసి పక్కకు తప్పించుకొని వెళ్ళిపోతుంది. కంపెనీలో ఎంతోమందికి ఉద్యోగం ఇచ్చిన నా కొడుకు కారులో తిరిగే నా కొడుకు ఇప్పుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు అని బాధపడుతుంది మధుర. కూరగాయలన్ని దించి వెళ్ళిపోతాడు శ్యామ్. కట్ చేస్తే, వెళ్ళిపోతున్న శ్యామ్ ట్రాలీ ఆటో కి రుక్మిణి తన కార్ అడ్డం పెడుతుంది. నా కారుకు బండి ఎందుకు అడ్డం పెట్టావ్ అని రుక్మిణి అంటుంది. నువ్వే నాకు ఎదురు వచ్చావు పక్కకు తప్పుకో అని శ్యామ్ అంటాడు. ఏంటి కార్లలో తిరిగినా నువ్వు కోట్లలో మునిగి తేలిన నువ్వు రాదని చేసుకోవడం వల్ల ఈ స్థితికి దిగి వచ్చావు ఆటో తోలుతూ కాలనీ గడుపుతున్నావా ఆ రాదని వదిలేసి నా దగ్గరికి వచ్చేయ్ నీ ఆస్తి నీ కొడుకు అంతా కలిసే ఉందాం అని రుక్మిణి అంటుంది.
రాధా కాలిగోటికి సరిపోవు నీ ఆస్తి అంత ఎవడైనా ప్రేమించే భార్య కావాలనుకుంటాడు కానీ ఇలా పగనిపించుకొని భర్త పతనానికి నా దారి తీసే ఆడదాన్ని ఎప్పటికీ కోరుకోడు నాకు రాదంటే ప్రాణం నీ కోట్ల ఆస్తి ముందు రాధ ప్రేమే నాకు విలువైనది అంటూ శ్యామ్ వెళ్ళిపోతాడు. శ్యామ్ వెళ్లిపోతూ ఉండగా రుక్మిణి ఫోటోలు తీస్తుంది. శ్యామ్ ట్రాలీ ఆటో వేసుకొని వెళ్లిపోతాడు, రుక్మిణి ఆ ఫోటోలు చూసి నవ్వుతూ ఉంటుంది. ఏంటి రుక్మిణి శ్యామ్ ఫోటోలు చూస్తున్నావు అని దాక్షాయని అంటుంది. ఇవి చూస్తూ మొరవడం లేదు వీటిని రాధకు పంపించి ఏడిపిస్తాను నా పగ తీర్చుకుంటాను అని రుక్మిణి రాధకి ఫోటోలు పంపిస్తుంది. ఏంటి అక్క నాకు ఆయన ఫోటోలు పంపించింది అని రాదా చూసుకుంటుంది. రుక్మిణి రాధా కి ఫోన్ చేసి చూసావా నీ జాతకం ఎలా ఏడ్చిందో నిన్ను కట్టుకోవడం వల్ల నీ భర్త ట్రాలీ డ్రైవర్ అయ్యాడు అని రుక్మిణి మాట్లాడుతుంది. నా బ్రతుకు ఏమైంది అక్క నీ బ్రతుకు గురించి ఆలోచించుకో కనీసం నాకు ఆటో డ్రైవర్ అన్న భర్తగా ఉన్నాడు నీకు కోట్ల ఆస్తి ఉన్న నీ పక్కన భర్త అనే వ్యక్తి
లేడు కదా నా దురదృష్టాన్ని చూసి ఏడవడం కన్నా నా అదృష్టాన్ని చూసి ని పక్కన భర్త లేనందుకు కుళ్ళుకో అంటూ రాధా ఫోన్ కట్ చేస్తుంది. ఆయన ఆటో తోలుతున్నాడని నాకు అక్క చూపించి హేళన చేసి మాట్లాడింది అలా జరగకూడదు ఏదో ఒకటి ఆలోచించాలి అని రాదా అనుకుంటుంది. పద పిన్ని మనకు ఫంక్షన్ కి టైం అయింది అడ్టు రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధా ఒకరోజు గుండెపోటుతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన అతని ఇంటికి వస్తుంది రాదా. వాళ్ల పనిమనిషి సార్ రాధా అనే అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని చెబుతుంది. తీసుకురా అని అతను చెబుతాడు. రాధా అక్కడికి వచ్చి నమస్కారం పెట్టి కూర్చుంటుంది. ఏంటి రాధా విశేషాలు ఇలా వచ్చావు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు అతను. ఆయన నీ సహాయమడిగితే ఏమనుకుంటాడో అనుకున్నా రాదా బాగానే ఉన్నాం సార్ మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని రాదా అంటుంది. వాళ్ల పనిమనిషి జ్యూస్ తెచ్చి రాదకి వాళ్ల సార్ కి ఇస్తుంది.
రాధా ఎప్పుడో నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసావ్ నన్ను గుర్తు పెట్టుకొని మరి ఇంటికి వచ్చి పలకరిస్తున్నావ్ నీది ఎంత గొప్ప మనసమ అని అతను అంటాడు.కట్ చేస్తే.మధుర ఒక ఓని ఫంక్షన్లో వంటలకి వెళుతుంది. అక్కడికి రుక్మిణి కూడా వస్తుంది.మధుర వంట చేస్తూ ఉంటుంది. అందరూ అమ్మాయిని ఆశీర్వదించి అక్షింతలు వేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన రుక్మిణి అమ్మాయికి గంధము కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించి గిఫ్ట్ చేతిలో పెడుతుంది. వెళ్లి కూర్చుందాం అనుకునే లోపు రుక్మిణి కి ఫోన్ రావడంతో మాట్లాడదామని వంట చేసే దగ్గరికి వెళుతుంది. ఏమండీ అందరూ ఆశీర్వదించడం అయిపోయింది
వెళ్లి వంటలు ఎంత వరకు వచ్చాయో చూడండి అని వాళ్ళ భార్య చెప్పడంతో అతను వంట చేస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్తాడు. వంటలు ఎంతవరకు వచ్చాయి అమ్మ అని అంటూ ఉండగా మధుర కనిపిస్తుంది. మధుర మేడం మీరేంటి ఇక్కడ మధుర నగరి కాలనీలో మహారాణిలో ఉండే మీరు వంట చేయడమేంటి అని అతను అంటాడు. పరిస్థితులు అలా వచ్చాయి అని మధుర బాధపడుతుంది. సరే అమ్మ నా కూతురు ఓన్లీ ఫంక్షన్ జరుగుతుంది మీరు ఎలాగూ వచ్చారు నా కూతుర్ని ఆశీర్వదించండి అని అతను తీసుకువెళ్తాడు.
ఆ అమ్మాయిని ఆశీర్వదించిన మధుర అమ్మాయి చాలా అందంగా ఉంది దిష్టి తగులుతుంది కార్యక్రమం అయిపోయాక దిష్టి తీయండి అని చెబుతుంది. వదిన ఏంటి ఇక్కడికి వచ్చింది వెంటనే రుక్మిణికి చెప్పాలి అంటూ దాక్షాయని వెళ్ళిపోతుంది. ఆ దిష్టి ఏదో తీయండి అమ్మ అందరూ దీవించడం అయిపోయింది అని వాళ్ళ అమ్మ అంటుంది. మధుర ఆ అమ్మాయికి దిష్టి తీసి నీళ్లు పారబోద్దామని వెళ్లి చూసుకోకుండా రుక్మిణి మీద పోసేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!