Madhuranagarilo December 08 2023 Episode 230: రౌడీలు అలా ఏడిపిస్తుంటే నేను వెళ్లి ఆ రౌడీలని చిత్తకొట్టి తరిమేశాను అప్పుడు అక్కడ నన్ను శిరీష చూసి మీరేంటండి ఇక్కడికి వచ్చారు అని అడిగింది. సామాన్ల కోసం బయలుదేరాను మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది ఈ సందులో నుంచి వెళ్దామని అనుకునే సరికి ఇక్కడ నేను రౌడీలు ఏడిపిస్తుంటే ఆగాను నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని నేను అడిగాను. కోచింగ్ సెంటర్ పక్కనే నండి ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను అని తను చెప్పింది, ఈ రౌడీల మధ్యలో నువ్వు ఎలా ఉంటావు మా ఇంటికి రా అని తీసుకు వచ్చాను ఇప్పుడు చెప్పండి శిరీషను తీసుకురావడంలో ఏదైనా తప్పు ఉందా అని రాదా అంటుంది. చాలా మంచి పని చేశావు రాదా రెండు నెలల్లో తనకు ఉద్యోగం వస్తుందని చెప్పింది కదా అపడి దాకా మన దగ్గరే ఉంటుందిలే అని మధుర అంటుంది. మీరు ఏమంటారు అండి అని ధన0జయని అడుగుతుంది. నేనేమంటాను మన ఇంట్లోనే ఉంటుంది అని ధనంజయ్ అంటాడు.
నువ్వేమంటావ్ రా శ్యామ్ అని మధుర అంటుంది. మీ ఇద్దరి మాట నేనెప్పుడైనా కాదన్నా అమ్మ తను ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు అని శ్యామ్ అంటాడు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు వదిన ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే బాగోదు అని దాక్షాయిని అంటుంది. అంటే ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు అప్పుడు చెప్పడానికి బాగోదు కదా అని తన ఉద్దేశం అని చలపతి అంటాడు.పండు కి హెల్ప్ చేసినప్పుడు కూడా ముక్కు మొహం తెలియదు అందుకే ఇంకేమీ ఆలోచించకుండా తను ఇక్కడే ఉంటుంది అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, అమ్మానాన్నలు నా గురించి బాధపడుతున్నారు నేను ఆయనతో కలిసి ఉంటే సంతోషిస్తారు ఆయన మారాడని వీళ్లకు అనిపించాలి అంటే ఆయనను నేను తీసుకువచ్చి పరిచయం చేయాలి అని అనుకుంటుంది రుక్మిణి. అమ్మ ఈరోజు నేను ఒకరిని మన ఇంటికి తీసుకు వస్తాను అని రుక్మిణి అంటుంది. పండుని తీసుకురావద్దని చెప్పాను కదా అమ్మ అని మురళి అంటాడు.
పండుని ఏమి తీసుకురానులే నాన్న మీ అల్లుడిని తీసుకొస్తాను అని రుక్మిణి అంటుంది. ఏంటి అల్లుడుగారిని తీసుకొస్తావా అని ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి అల్లుడు గారిని తీసుకువస్తాను అంటే ఏదో ఆటో బాంబ్ తీసుకొచ్చినట్టు షాక్ అవుతున్నారు తీసుకురాకూడద అని రుక్మిణి అంటుంది. తను రెండో పెళ్లి చేసుకున్నాడు కదమ్మా మన ఇంటికి తీసుకొస్తే బాగోదు అని మురళి అంటాడు.ఏంటి నాన్న పండుని తీసుకొస్తానంటే వద్దని ఏదో సాకు చెప్పావ్ సరే అని ఊరుకున్నాను కానీ అయనని తీసుకొస్తానంటే కూడా అలాగే సాకు చెప్తున్నావు ఈరోజు ఎలాగైనా అతన్ని ఇక్కడికి తీసుకు వస్తాను ఇది ఫిక్స్ అని రుక్మిణి వెళ్ళిపోతుంది.
ఏంటి నాగమణి అల్లుడు ఇప్పుడు మన ఇంటికి వస్తే రాద వాళ్ల అక్క తన మొదటి భార్య అని శ్యామ్ కి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా నాగమణి అని మురళి టెన్షన్ పడతాడు. కట్ చేస్తే, మధుర వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పు అమ్మాయి నీ పేరేంటి అని దాక్షాయిని అడుగుతుంది. నా పేరు శిరీష అండి అని శిరీష చెప్తుంది. నీ పేరులో సిరి ఉంది కానీ నీ జాతకంలో సిరిసంపదలు లేవన్న మాట అని దాక్షాయిని అంటుంది. అమ్మాయి హాస్టల్ లో ఉన్నప్పుడు నువ్వు ఎంత డబ్బు కట్టే దానివి అని చలపతి అడుగుతాడు. 4000 కట్టే దాని అంకుల్ అని శిరీష చెప్తుంది. ఇంకేంటి 4000 మిగిలినట్టే లే అని చలపతి అంటాడు. మీరు ఎప్పుడు ఇంతేనా ఇక మారరా ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది చెప్పడానికి అని మధుర అంటుంది.
ఇంతలో శిరీషకి పూల మారుతుంది. అలా పొల మారితే మనల్ని ఎవరైనా తలుచుకుంటున్నట్టు శిరీష అక్క అని పండు అంటాడు. అనాధని నన్ను ఎవరు తలుచుకుంటారు అని శిరీష అంటుంది.ఆ మాట వినగానే ధనంజయ్ బాధ పడి అన్నం తినకుండా చెయ్యి కడుక్కుంటాడు. అదేంటి మామయ్య అన్నం సరిగ్గా తినలేదు అని రాదా అడుగుతుంది. తినబుద్ధి కావట్లేదు అమ్మ అంటూ ధన0జయ్ వెళ్ళిపోతాడు. అందరూ భోజనం చేసేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు చెప్పు అమ్మాయి నీ గురించి అని మధుర అడుగుతుంది.
మీ అమ్మానాన్నలు ఎవరు ఎక్కడ ఉంటారు అని మధుర అడుగుతుంది. ఏముందండి చెప్పుకోవడానికి అమ్మ చనిపోయింది నాన్న ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క అని శిరీష బాధపడుతూ అంటుంది. ఆ మాట వినగానే ధన0జయ్ గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ధన0జయ్ బాధపడడం గమనించిన రాదా తన వంక చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!