Madhuranagarilo: అంటే మీ నాన్న లేడా చనిపోయాడా అని అంటుంది మధుర. మా అమ్మని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నన్ను అనాధల చేసి తన దారి తను చూసుకున్నాడు తనే మంచివాడు అయితే నాకు పరాయి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది అని శిరీష అంటుంది. తను నాకు కనిపిస్తే నన్ను ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని నిలదీయాలని ఉంది మా అమ్మని నన్ను ఎందుకు మోసం చేసావ్ అని అడగాలనిపిస్తుంది అని శిరీష అంటుంది. నువ్వు అలా బాధపడకు శిరీష మీ నాన్నని నిలదీసే రోజు తప్పకుండా వస్తుంది మీ నాన్నని నేను వెతికి పెడతాను అని శ్యామ్ అంటాడు.ఎందుకు శిరీష ఏడుస్తున్నావు అని శ్యామ్ అంటాడు.
ఇవి బాధలో వచ్చిన కన్నీళ్లు కాదండి నాకు ఒక అన్నయ్య ఉంటే ఇలాగే మాట్లాడేవాడేమో అనే ఆనందంతో వచ్చిన కన్నీళ్లు ఇవి అని శిరీష అంటుంది. నేను కూడా నీ అన్నయ్యనే అనుకో అమ్మ ఇక మీదట నీ బాధ్యత నాదే నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అని శ్యామ్ అంటాడు. శిరీష అలాగే ఏడుస్తుంది. తన కన్నీళ్లను బాధను చూసి ధన0జయ్ బాధపడతాడు.ఏంటి అన్నయ్య అమ్మాయిని చూసి ఎమోషన్ అవుతున్నాడు ఇదేదో మనకు ఉపయోగపడే విషయం లాగా ఉంది అని దాక్షాయిని అంటుంది. శిరీష ఏడవ కమ్మ నీకు నేనున్నాను కదా అని శ్యామ్ ఓదారుస్తాడు. కట్ చేస్తే, నేను మీ అమ్మని నిన్ను మోసం చేసి వదిలేయలేదమ్మా కాలమే నిన్ను నన్ను మీ అమ్మని విడదీసింది అని ధనంజయ్ బాధపడుతూ ఉంటాడు.
ఇంతలో దాక్షాయిని వచ్చి ఏంటన్నయ్య అంత బాధ పడుతున్నావు ఎందుకు శిరీష మాట్లాడుతున్నప్పుడు తననే చూస్తున్నావ్ వాళ్ళ అమ్మకి నీకు మధ్య గతంలో ఏమైనా సంబంధం ఉందా అని దక్షయని అంటుంది. గతం గురించి మాట్లాడితే మిమ్మల్ని నేను ఇంట్లోకి రానిచ్చే వాడిని కాదు ఎందుకు గతం గురించి మాట్లాడుతారు గతాన్ని మరిచిపోయి బ్రతకాలి ఇంకెప్పుడూ ఇలాంటి వంకర్ మాటలు మాట్లాడకండి వెళ్లండి అని ధనంజయ్ చిరాకు పడుతూ కోపంలో అంటాడు. దాక్షాయిని వాళ్ళ ఆయన వెళ్ళిపోతారు. ఏంటి పిన్ని గారు అదోలా ఉన్నారు అని రాదా అడుగుతుంది. మేము బాగానే ఉన్నాము అమ్మ మీ మామగారే చిరాకు పడుతున్నాడు అని దాక్షాయిని అంటుంది. మామయ్య గారు నిన్నటి నుంచి ఎందుకు అదోలా ఉంటున్నారు అదేంటో తెలుసుకోవాలి అని రాదా కాఫీ తీసుకొని వెళ్తుంది. మామయ్య గారు కాఫీ తాగండి అని అంటుంది రాదా. నాకు తాగాలని లేదమ్మా అంటాడు ధన0జయ్.
ఎప్పుడూ కాఫీ వద్దన్నారు కదా మామయ్య గారు అసలేం జరిగింది అని రాదా అడుగుతుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా అమ్మ ఇప్పుడు కాఫీ తాగాలనిపించట్లేదు ప్లీజ్ వెళ్ళమ్మా అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే మేడం సార్ ఇంకా ఆఫీస్ కి రాలేదేంటి నీకేమైనా తెలుసా అని ఆఫీస్ బాయ్ అడుగుతాడు. ఎందుకు రాలేదు నాకెలా తెలుస్తుంది ఫోన్ చేసి కనుక్కో అని రుక్మిణి అంటుంది. ఆయనకు ఫోన్ చేసి అడిగే ధైర్యం నాకు లేదు మేడం మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను అని ఆఫీస్ బాయ్ వెళ్ళిపోతాడు. ఇంతలో శ్యామ్ వస్తాడు. మీరు రాలేదని మీ పిఏ ఆ కంగారు పడుతున్నాడు అని రుక్మిణి అంటుంది. ఎప్పుడు తొందరగా వస్తారు కదా సార్ ఈరోజు లేట్ అయిందని అడిగాను అని అతను అంటాడు.
కట్ చేస్తే,శ్యామ్ క్యాబిన్లో వెళ్లి కూర్చుంటాడు. రుక్మిణి వచ్చి మనం సాయంత్రం ఒక చోటికి వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి అని శ్యామ్ అంటాడు. నీకు తొందరగా ఎక్కువ సుందరం ఎక్కడికి వెళ్లాలో సాయంత్రం చెప్తాను అని రుక్మిణి అంటుంది. ఈ రాక్షసి తో పెట్టుకునే కన్నా ఒప్పుకోవడం బెటర్ అని శ్యామ్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే, రుక్మిణి రాధా కి ఫోన్ చేసి మీ బావని సాయంత్రం ఇంటికి తీసుకు వస్తున్నాను అని చెప్తుంది. అవునా అక్క చాలా సంతోషం అని రాదా అంటుంది. అవును రాధా నా గురించి అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు మా ఆయనను చూస్తే నైనా వాళ్లకు కొంత ఉపశమనం పొందుతరు అని రుక్మిణి అంటుంది. సరే రాధా నాకు ఆఫీస్ లో పని ఉంది దీని తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఎలాగూ అక్క బావని తీసుకువస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్లి పండు గురించి అడిగి తెలుసుకుంటాను అని రాధా అనుకుంటుంది.
అత్తయ్య నేను మా ఇంటికి వెళ్తాను అని రాదా అంటుంది. మీ బావ మీ అక్క దగ్గరికి వస్తున్నాడు అంటే సంతోషమే కదా అమ్మ మీ అమ్మ నాన్నలు సంతోషిస్తారు అలాగే వెళ్ళు అని మధుర అంటుంది. కట్ చేస్తే రాదా రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి రాధా ఇలా వచ్చావ్ అని మురళి అంటాడు.ఏంటి నాన్న బావ వస్తున్న సంగతి నాకు చెప్పలేదు అని రాదా అడుగుతుంది. అక్క బావని సాయంత్రం ఇంటికి తీసుకువస్తుందంట కదా నాకు ఫోన్ చేసి చెప్పింది బావని చూద్దామని నేను వెంటనే వచ్చేసాను అని రాదా అంటుంది. మురళి నాగమణి టెన్షన్ పడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!