Madhuranagarilo: పెళ్లయిన నెలకి మేమిద్దరం విడిపోయాం రాదా ఆ రాక్షసి నన్ను అంతలా టార్చర్ చేసింది దానితో నేను ఎలా కలిసి ఉండగలను అని శ్యామ్ అంటాడు. రాధా అందుకే నా మొదటి భార్యని త్వరలోనే వదిలించుకుందామనుకుంటున్నాను కానీ ఈలోపే ఇంకొక మాట చెప్పింది అని శ్యామ్ అంటాడు. ఏం చెప్పింది సార్ అని రాదా అడుగుతుంది. పెళ్లయిన నెల రోజులకు మేము విడిపోయిన తర్వాత తను నెల తప్పిందని తెలిసిందంట ఒక బిడ్డ ఉన్నాడు అని చెప్పింది ఆ బిడ్డ ను చూపించలేదు ఫోటో కూడా చూపించలేదు వాడి పేరు కూడా చెప్పలేదు వాడిని చూపించమంటే నీ రెండో భార్యకు విడాకులు ఇవ్వు అప్పుడే పండును చూపెడతాను అంటుంది లేదంటే నీ ఇంటికి వచ్చి నీ రెండో భార్యకు చెప్తాను అని బెదిరిస్తుంది అని శ్యామ్ అంటాడు. రాధా అదే వాళ్ళ చెల్లెలు రెండో భార్య ప్లేస్ లో ఉంటే ఇలాగే మాట్లాడుతుందా ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలనుకుంటుందా చెప్పు రాదా అలాంటి రాక్షసి తో నేను జీవితాంతం ఎలా ఉండగలను తను మారిపోయి నాతో జీవితాంతం గడుపుతాను అంటే నేను ఎలా నమ్మగలను అని శ్యామ్ అంటాడు.
రాధా నేను ఆఫీసుకు వెళ్లి వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది ఎందుకు లేట్ అయిందని అడిగి నన్ను ఒక రూమ్ లో బంధించి ఆ రోజంతా అన్నము మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించి టార్చర్ చేసింది చెప్పు రాదా అలాంటి దాంతో నేను ఎలా బ్రతకగలను అని శ్యామ్ అంటాడు. అప్పుడు నేను అనుకునేవాన్ని పెళ్లయిన కొత్తలో కదా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది అని అనుకునే వాణి కానీ తనకు నా మీద అనుమానం అని కొన్నాళ్లకే తెలిసింది అని శ్యామ్ అంటాడు. రాధా శ్యామ్ ఒక్కొక్క మాట చెప్తుంటే అక్క ఇంతలా ఆయనని బాధపెట్టిందా అని అనుకుంటుంది.
ఒకరోజు నైట్ టైం లో ఆఫీస్ నుంచి జయ అనే అమ్మాయి ఫోన్ చేసింది సార్ రేపు డ్యూటీ లేదు కదా పెండింగ్ వరకు చాలా ఉంది మన స్టాఫ్ నందరిని రమ్మంటావా వర్క్ ఫినిష్ చేద్దామని నాకు చెప్పింది ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుండగా నా భార్య వచ్చింది ఎవరు అని అడిగింది జయ అని నేను చెప్పాను జయ అంటే వైజాగ్ అమ్మాయి కదా డ్యూటీ లేకపోయినా నీకెందుకు ఫోన్ చేసింది మీరిద్దరూ కలిసి రేపు డ్యూటీ లేకపోయినా సినిమాలకు సికార్లకు తిరగడానికి కదా దానితో మాట్లాడడం మానేసి రిలేషన్ చెప్పు మానేస్తే కానీ నాతో ఉండడానికి కుదరదు అని వెళ్ళిపోయింది
అలాంటిది మళ్లీ నా జీవితంలోకి వచ్చి నాతో ప్రేమగా ఉంటాను అంటే నేను ఎలా రాదా నమ్మేది నన్ను భార్యగా స్వీకరిస్తేనే బాబును చూపెడతాను అంటే నాకు ఆ బాబు అక్కర్లేదు రాదా అని శ్యామ్ అంటాడు. నా బిడ్డను నేను ఎలాగో అలా తెచ్చుకుంటాను అప్పుడు పండు ఆ బాబు ఇద్దరు మనకు కొడుకులవుతారు అని శ్యామ్ అంటాడు. కన్నతల్లి బిడ్డను వదిలేసి ఎలా ఉండగలుగుతుంది సార్ అది న్యాయం కాదు ఏ భార్య అయినా ఆ బిడ్డను వదిలిపెట్టి ఉండలేదు అని రాదా అంటుంది. అలాగైతే ఆ బిడ్డను తనకే వదిలేస్తాను రాధా కానీ నిన్ను మాత్రం వదులు కో లేను నీవల్లనే ఆడవాళ్లంటే గౌరవం పెరిగింది నీలాంటి దాన్ని వదులుకొని నేను బ్రతకలేను రాదా నువ్వు నాకు కావాలి నాకు ఆ బిడ్డ లేకపోయినా పర్వాలేదు అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, నాగమణి అమ్మాయి ఇంకా రాలేదా ఏంటి ఆఫీస్ నుంచి అని మురళి అంటాడు.
అసలు ఆఫీసుకు వెళ్లలేదండి అని నాగమణి అంటుంది. అదేంటి నాగమణి ఆఫీస్ కి వెళ్లకుండా రుక్మిణి ఎక్కడికి వెళ్లింది అని మురళి అంటాడు.ఏమో నండి ఒకవేళ రాధకి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్లిందా ఏంటి పండును చూడడానికి అని నాగమణి అంటుంది. అలా వెళ్తే ప్రమాదం కదా నాగమణి అక్కడ అల్లుడుగారు కూడా ఉంటాడు అల్లుడ్ని చూసేసింది అంటే వాళ్ల చెల్లెలే తన భర్త భార్య అనుకుంటుంది అప్పుడు ఇద్దరి బిడ్డల జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి ఎలా నాగమణి అని మురళి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి రానే వస్తుంది. అమ్మ రుక్మిణి ఎక్కడికి వెళ్లావు అమ్మ ఇప్పటిదాకా మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని నాగమణి అంటుంది. ఎందుకమ్మా మాట మారుస్తారు నేను అంతా విన్నాను మీరు రాదా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని మాట్లాడుకుంటున్నారు ఎందుకమ్మా నేను రాధ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అని రుక్మిణి అడుగుతుంది.
మేమెందుకు అంట మామ అలా మీ చెల్లెలు దగ్గరికి నువ్వు వెళ్లొచ్చు అని నాగమణి అంటుంది. లేదమ్మా నేను ఎప్పుడు రాధ వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నా కానీ ఎందుకు వెళ్లడం వద్దులే అంటారు పండుని చూడడానికి వెళ్తానన్నా కానీ కంగారు పడిపోయి ఎక్కడికి ఎందుకమ్మా పిల్లవాడు భయపడిపోతాడు అంటారు ఎందుకమ్మా నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అని రుక్మిణి అంటుంది. అర్థమైంది అమ్మ నేను రాదా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దని మీరు అంటున్నారు నాకు అంత అర్థమైంది అని రుక్మిణి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!