Madhuranagarilo January 13 2024 Episode 261: అందుకనే నువ్వు డాడీని విసిగించకుండా ఉంటే చాలా మంచిది పండు అని రాదా చెప్తుంది. అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను అని పండు అంటాడు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అండి మనమే అని మధుర అంటుంది. అవును మధుర మనమే ఏదో ఒకటి చేసి ఆఫీస్ కి వెళ్లే అమ్మాయితో మాట్లాడాలి అని ధనంజయ్ అంటాడు. అవునండి ఎందుకంటే అలా చేయకపోతే రాదా మనకు దూరమైపోతుంది శ్యామ్ వదిలేసి వెళ్ళిపోతుంది అలా జరగకూడదు అంటే మనమే వెళ్లి అమ్మాయితో మాట్లాడాలి అని మదర అంటుంది.కట్ చేస్తే,చలపతి డబ్బులు లెక్కబెడుతూ ఉంటాడు. ఏంటి ఎన్నిసార్లు లెక్కబెట్టిన20 వేరే వస్తున్నాయా అని దాక్షాయిని అంటుంది.అవును దాక్షాయిని ఎంత లెక్కపెట్టినా 20,000 వేలు 20 లక్షలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చలపతి అంటాడు. ఎలా అవుతాయి అండి అని దాక్షాయిని అంటుది.
రాధా పండు స్కూల్ కి వెళ్ళమని చెప్తుంది. కట్ చేస్తే,ధనుంజయ్ మధుర ఆఫీస్ కి వెళ్తారు. ఏంటి మేడం ఇలా వచ్చారు సార్ రాలేదా అని సెక్రెటరీ అడుగుతాడు. సార్ ఆఫీస్ కి రాలేదా మీ మేడం ఎక్కడ అని మధుర అడుగుతుంది. ఇంకా రాలేదు మేడం నేను కొత్తగా వచ్చాను మీరు వెళ్లి ఆఫీసులో కూర్చోండి మేడం అని సెక్రటరీ అంటాడు. వాళ్ళిద్దరూ ఆఫీసులో వెళ్లి కూర్చుంటారు. ఎలాగైనా సరే మధుర ఆ అమ్మాయితో మాట్లాడి శ్యామ్ దూరం చేయాలి లేదంటే వాడు ఈ సమస్యలతో సతమతమై పోతూ ఉంటాడు అని ధనంజయ్ అంటాడు. అవునండి ఆ అమ్మాయికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేసి శ్యామ్ జీవితంలో నుంచి వెళ్ళిపొమ్మని చెబుదాం లేదంటే మన ఊహించినట్టుగానే రాదా శ్యామ్ దూరమైపోతుంది అటు రాదని దగ్గరికి తీసుకోలేక ఇటు ఆఫీసులో ఈ అమ్మాయితో వెల్లగొట్టలేక వాడు రోజు తాగి వచ్చి రాదని బాధ పెడుతున్నాడు అలా జరగకూడదు అంటే ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా సరే పంపించేయాలి అని మధుర అంటాడు.
కట్ చేస్తే, డాడీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా అని పండు అడుగుతాడు. నేను అటే వెళ్తున్నాను నేను డ్రాప్ చేస్తానులే అన్నయ్య అని శిరీష అంటుంది. నువ్వైతే ఓకే అక్క డాడీ వెళ్ళొస్తాను అని పండు వెళ్ళిపోతాడు. ఏమండీ మీరు టిఫిన్ చేదురు గాని రండి అని రాధా అడుగుతుంది.ఏంటి రాదా అలా ఉన్నావ్ నిన్న జరిగింది ఇంకా మర్చిపోలేదు అని శ్యామ్ అంటాడు. అదేమీ లేదండి అని రాధా అంటుంది. టిఫిన్ పెట్టు మాకు ఆకలి వేస్తుంది అని చలపతి దాక్షాయి ని అంటారు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అని శ్యామ్ అడుగుతాడు. పొద్దున బయటికి వెళ్లారండి పనుందని రాదా చెప్తుంది. బయటికి వెళ్లారా ఎక్కడికి అని శ్యామ్ అంటాడు. అదేరా నువ్వు ఈ మధ్య పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావు కదా ఏదైనా జాతకం చూపించి దోషము ఉందేమో తెలుసుకుందామని వెళ్ళుంటారు అని దాక్షాయిని అంటుంది.
నాకు జాతక దోషం అడగడానికి వెళ్లడమేంటి అత్తయ్య అని శ్యామ్ అంటాడు. అవున్రా నువ్వు ఈ మధ్య తాగు వచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావ్ అందుకే నీ ప్రవర్తన చూసి వాళ్ళు బాధ తట్టుకోలేకపోతున్నారు అని చలపతి అంటాడు. ఎక్కడికి వెళ్లారొ వస్తారు లేరా టిఫిన్ చెయ్ ముందు అని దాక్షాయిని అంటుంది. నాకు ఆకలిగా లేదు మీరు తినండి అత్తయ్య అని శ్యామ్ పక్కకు వెళ్లి ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. అవును సార్ మీ అమ్మానాన్న ఆఫీస్ కి వచ్చారు మీ క్యాబిన్లో కూర్చో పెట్టాను మాట్లాడతారా అని అతను అంటాడు. వద్దులే నేను ఇప్పుడే ఆఫీస్ కి వస్తున్నాను అని శ్యామ్ అంటాడు. రాదా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని శ్యామ్ అంటాడు. అదేంటండి అలా అంటారు అని రాదా అంటుంది టైం లేదు రాదా ఆఫీస్ కి వెళ్ళాలి ఆకలి వేస్తే ఆఫీసులో తెప్పించుకుంటానులే అని శ్యామ్ వెళ్ళిపోతాడు. ఇదేంటండి పొద్దునేమో వీళ్ళ అమ్మానాన్న టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు ఇప్పుడు వీడు ప్లేట్లో టిఫిన్ పెడితే తినకుండా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అని దాక్షాయిని అంటుంది.
ఏమోలే మనకెందుకు మన కాకలేస్తుంది కదా నువ్వు తిను అని చలపతి అంటాడు. కట్ చేస్తే,శ్యామ్ ఆఫీస్ కి వెళ్తాడు. సార్ మీ అమ్మ నాన్న క్యాబిన్లో ఉన్నారు వెళ్ళండి అని సెక్రెటరీ చెప్తాడు. రుక్మిణి మేడం రాలేదా అని శ్యామ్ అడుగుతాడు. లేదు సార్ ఈరోజు మేడం కు ఎందుకొ లేట్ అయ్యింది ఇంకా రాలేదు అని అతను చెప్తాడు. శ్యామ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి ఇదేంటి నాన్న మీరు ఆఫీస్ లోకి ఎందుకు వచ్చారు నేను చెప్పాను కదా ఆ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తానని మీరు వచ్చారు ఎందుకు ఆ రాక్షసి మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది లేదంటే ఇంటికి వచ్చి కూర్చుంటుంది అప్పుడు రాదా కు నిజం తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా జరగకూడదనే కదా నేను ఆలోచించేది అని శ్యామ్ అంటాడు. నువ్వు చెప్పలేవు రా అమ్మాయికి సమాధానం మేమే చెప్పాలి అని మధుర అంటుంది.
లేదమ్మా మీరు మాట్లాడితే రేపటి నుంచి మీతో టార్చర్ మొదలవుతుంది మీ రెండో కోడలును వెళ్లగొడతారా నేను ఇంటికి వచ్చి మీ పరువు తీయనా అని బెదిరిస్తుంది అందుకే కదా తను ఆఫీసులో జాయిన్ అయినా కానించి ఇకనుంచి ఎలా పంపించాలని టైం కోసం ఎదురు చూస్తున్నాను ప్లీజ్ అమ్మ నన్ను అర్థం చేసుకోండి తను రాకముందే మీరు ఇకనుంచి వెళ్లిపోండి అని శ్యామ్ అంటాడు. నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాం అని మధుర ధనంజయ్ వెళ్ళిపోతారు. ఎలాగో అలా రుక్మిణి రాకముందే అమ్మానాన్నను పంపించేశాను లేదంటే పెద్ద గొడవ జరిగిపోయేది అని శ్యామ్ అనుకుంటాడు. కట్ చేస్తే, ఏంటన్న ఏమైంది అని రుక్మిణి అంటుంది. ఏమోనమ్మా చూస్తాను ఉండు ఆగిపోయింది అని అతను అంటాడు. తొందరగా చూడు అన్న ఇప్పటికే ఆఫీస్ కి లేట్ అయింది అని రుక్మిణి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!