Nindu Noorella Saavasam April 3 2024 Episode 201: అరుంధతి వెళ్లి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది. అరుంధతి భాగమతి ఒంట్లో ఉండి తన ఇంట్లోకి మొదటిసారి అడుగు పెట్టినట్టు లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఈ తాడు నా చేతికి కట్టు నీలా అని మనోహరి అంటుంది. ఎందుకు అమ్మగారు అని నీలా అడుగుతుంది. అమర్ నా మెడలో తాళి కట్టకుండా అరుంధతి ఆపుతుందని ఘోర చెప్పాడు అలా జరగకూడదు అమర్ కి భాగమతికి పెళ్లి అవుతుందని వాళ్ల పిన్ని చెప్పింది అరుంధతి మీద నేను గెలవాలి అంటే నేను వాళ్లకంటే పది అడుగులు ముందే ఉండాలి అందుకే ఈ తాడును నా చేతికి కట్టు ఇదే నాకు రక్ష అని ఘోర చెప్పాడు అని మనోహరి అంటుంది. పెళ్లిలో ఈ తాడు ఉంటే పంతులుగారు ఎందుకు ఇది కట్టుకున్నావ్ అని అడిగితే ఏం చెప్తావని నీలా అడుగుతుంది.
అదంతా నేను చూసుకుంటాను నువ్వు కట్టు అని మనోహరి చేయి చాపుతుంది నీలా తనకి తాడుకడుతుంది.అక్క నా కంటికి కనిపించందు ఇక కంటికికనిపించే చెల్లి ఏం చేస్తుందో చూడాలి అమర్ తో నా పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో చూడాలి అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే,అరుంధతి తన ఇంట్లోకి వెళ్లి కొత్తగాచూస్తుంది ఇల్లంతా తిరుగుతూ ఆనందంగా గంతులు వేస్తూ ఉండగా మనోహరి అక్కడికి వస్తుంది. భాగమతి తనను అలాగే చూస్తూ ఉంటుంది.ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావ్ అని మనోహరి అంటుంది. నిన్ను కొత్తగా చూస్తున్నాను కదా మను అని భాగమతి అంటుంది. ఏంటి అరుంధతి తప్ప నన్ను ఎవరు మను అని పిలువలేరు నువ్వు పిలుస్తున్నావేంటి అని మనోహరి అంటుంది. పిలవాలి అనిపించింది పిలిచాను ఏంటి భయపడుతున్నావా నువ్వు ఆయనని పెళ్లి చేసుకుని ఎలా ఆనందంగా ఉంటావో నేను చూస్తాను అని భాగమతి అంటుంది.
నన్ను డైరెక్టుగా ఏమీ చేయలేక ఇలా ఆరుల మాట్లాడి బెదిరిస్తున్నావా అని మనోహరి అంటుంది. నువ్వు స్నేహం పేరు చెప్పి మోసం చేసిన బాధపడేదాన్ని కాదే నా కుటుంబం జోలికి వచ్చావు నిన్ను వదలను అని భాగమతి ఒంట్లో ఉన్నావు అరుంధతి అంటుంది. ఇంతలో అంజలి అక్కడికి వచ్చి ఏమైంది మిస్సమ్మ అని అడుగుతుంది. అంజు నా బంగారు తల్లి అని అంజలి ఎత్తుకొని ముద్దాడుతుంది భాగమతి. పిల్లలందరినీ దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఆ పిల్లల్ని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అని నీలా అంటుంది. నాక్కూడా అదే అనిపిస్తుంది బహుశా ఓడిపోతానని ఇలా ప్రవర్తిస్తుందేమో అని మనోహరి అంటుంది. మిస్సమ్మ పిల్లల్ని కొత్తగా చూస్తున్నట్టు అంత ఎమోషనల్ అయిపోతున్నావు ఏంటి అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ రోజు మమ్మల్ని చూస్తున్నావుగా మరి ఈరోజు ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నావ్ అని అంజలి అడుగుతుంది. మీరు క్యాంపుకు వెళ్తే మిమ్మల్ని చాలా రోజులు చూడలేకపోయేదాని కదా అది గుర్తుకు వచ్చి బాధేసింది అంజు అని అరుంధతి అంటుంది.
తల్లి నుంచి బిడ్డలను ఎవరైనా వేరు చేయగలరా అని శివరామ్ అంటాడు. అంకుల్ మిస్సమ్మ పిల్లలకు తల్లి ఏంటి అని మనోహరి అంటుంది. కేర్ టేకర్ అంటే తల్లి లాంటిదే కదమ్మా అందుకే అలా అన్నాను అని శివరామ్ అంటాడు. నాకు కడుపు మంటగా ఉంది ఆకలేస్తుంది తిందామా అని మనోహరి అంటుంది. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అమరేంద్ర కూర్చుంటూ ఉండగా మీద ఖర్చు వేస్తుంది. అదేంటమ్మా తినకముందే ఇలా చేస్తున్నావ్ అని నీలా అడుగుతుంది. ఆయనకు ఇలాగే అలవాటు అని భాగమతి అంటుంది. మేము మర్చిపోయిన మా వాడి అలవాటు నీకెలా తెలుసు అని నిర్మల అడుగుతుంది. సార్ ఇలా ఒకసారి తినడం చూశాను అందుకే ఇలా చేశాను అని భాగమతి అంటుంది.
నీలా వడ్డించమని నీకు సపరేట్గా చెప్పాలా అని కోపంతో అంటుంది మనోహరి. మీ అందరికీ నా చేతులతో వడ్డించే అవకాశం దొరికింది మళ్లీ నాకు దొరుకుతుందో దొరకదో అని భాగమతి అంటుంది. మాతో ఉండేది ఒక్కరోజు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అమరేంద్ర అంటాడు. మీ అందరికీ నా చేత్తో వడ్డించాలని ఉందండి అందుకే అన్నాను అని భాగమతి అందరికీ అన్నం వడ్డిస్తుంది. అంకుల్ మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇందులో ఆరోగ్యానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటయి కాబట్టి తప్పకుండా తినాలి అని భాగమతి వడ్డిస్తుంది. ఆంటీ నీకు పప్పులో నంజుకోవడానికి ఆవకాయ ఒక పీస్ వేస్తున్నాను అని వేస్తుంది. అమ్ములు పాపకి ఇష్టమైన సాంబార్ దాంట్లోకి అప్పడం అని అమ్ములు కి వేస్తుంది. అంజలికి ప్రేమగా గోరుముద్దలు పెట్టి తినిపిస్తుంది.
ఆనంద్ పైన తినడానికి ఏమీ లేవు ఇక్కడే కడుపునిండా తిను అని భాగమతి అంటుంది. ఆకాష్ ఆకుకూర తప్పకుండా తినాలి తిను అని అని భాగమతి అంటుంది. ఏవండీ ఈరోజు కడుపునిండా తినండి మీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై కూడా ఉంది అని భాగమతి అంటుంది. అచ్చం మా కోడలు లాగే వడ్డిస్తున్నావమ్మా అని శివరామ్ అంటాడు. అనాధనేనా నన్ను ఇంట్లో ఒకరిని చేసుకున్నారు నేను చనిపోయాక కొన్నాళ్లు నన్ను మర్చిపోతారు అనుకున్నాను కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఇంత బాధ పడుతున్నారు అని మనసులో అనుకుంటుంది అరుంధతి మా అలవాట్లన్నీ నీకెలా తెలుసు మిస్సమ్మ అని నిర్మల అంటుంది. అవేలా మర్చిపోతాను అత్తయ్య అని భాగమతి అంటుంది. ఆంటీ నీకు అత్త ఏంటి అని మనోహరి అంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చాను కదా అలవాటులో అలా పిలిచేసాను అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!