Nindu Noorella Saavasam March 21 2024 Episode 190: ఎందుకమ్మా అంత కోపంగా వచ్చారు అని నీలా అడుగుతుంది. అది నా నా ప్లేస్ నీలా పక్కన పెట్టుకొని పండుకుంటాడా ఆ మిస్సమ్మ నా తోటే చాలెంజ్ చేసిందే చూడు దానికి రేపటి నుంచి ఎలా ఇస్తాను అని మనోహరి అంటుంది. ఎంతైనా నేను అలిగానమ్మ మిస్సమ్మని పక్కన పెట్టుకొని నన్ను దూరం పెట్టారు అని నీలా అంటుంది. నీలా నాతో ఎందుకు పెట్టుకున్నాను అని ఆ మిస్సమ్మఅనుకునేలా చేస్తానే అని మనోహరి అంటుంది.రాథోడ్ గారు మనోహరి ఇలా చేస్తుందని నేను ఊహించలేకపోయాను ఇప్పుడు ఎలాగండి అని భాగమతి అంటుంది.కట్ చేస్తే,అరుంధతి రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వద్దు బాలిక లోపలికి వెళ్లదు అని గుప్తా అంటాడు. అరుంధతి లోపలికి తలుపు నెట్టుకొని వెళ్తుంది. రామ్మూర్తి కి ఎవరో వచ్చినట్టు అనిపించి తన వంక చూస్తాడు. ఎవరు నువ్వు అని రామ్మూర్తి అంటాడు.అరుంధతి సంతోష పడిపోయి నేను కనిపిస్తున్నానా అని అనుకుంటుంది.
నేను అమరేంద్ర సార్ వాళ్ళ ఇంట్లో తోటమాలినండి మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని గుప్తా అంటాడు. ఎవరయ్యా నువ్వు పగటివేష గళ్ళు అందరూ మా ఇంట్లోకి వస్తారు ముందు బయటికి వెళ్ళు అని మంగళ అంటుంది. అవసరం ఉంటే తప్ప మాట్లాడొద్దు అన్నాను కదా నువ్వు నీ పని చూసుకో రెండు కాపీలు పెట్టు అని రామ్మూర్తి అంటాడు. వచ్చింది ఒక్కరే కదా ఇద్దరం అంటారేంటి అని మంగళ అంటుంది. నీకు కనిపిస్తున్నది ఒక్కరే అయినా నాకు ఇద్దరు వచ్చినట్టు అనిపిస్తుంది అని రామ్మూర్తి ఇక్కడ నీకు ఎవరూ కనిపించట్లేదా అని అరుంధతి మొహం మీద చేయి పెడతాడు. తనకి స్పర్శ తెలుస్తుంది.అరుంధతి కంగారు పడలో సంతోషపడాలో అర్థం కాకా బాధపడుతుంది.
నాతో ఏం మాట్లాడాలి చెప్పు అని రామ్మూర్తి అంటాడు. మీకు మిస్సమ్మ కాక ఇంకొక అమ్మాయి ఉందా మీకు ఇద్దరు కూతుర్ల అని గుప్తా గారు అంటారు. రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకండీ ఏడుస్తున్నారు అని గుప్తా అంటాడు.ఆడపిల్ల చేత కన్నీళ్లుపెట్టించకూడదు అలాంటిదే నేను నా కూతురికి అన్ని కష్టాలే ఇచ్చాను పుట్టగానే అనాధ ఆశ్రమంలో వేశాను ఆ బంగారు తల్లిని ఎంతో ముద్దుగా మురిపంగా పెంచుకోవాల్సిన నేనే వద్దని హాస్టల్లో నాకు తెలియకుండానే వేశాను కానీ ఆ తరువాత అన్ని హాస్టలు వేతికాను నా కూతురు ఎక్కడా దొరకలేదు కానీ ఈ మధ్యనే తెలిసింది నా కూతురు సరస్వతి అని వాడను దగ్గర పెరిగింది అంట అని రామ్మూర్తి బాధపడతాడు. ఆ మాట విన్న అరుంధతి షాక్ అయిపోతుంది. కచ్చితంగా ఇతనితో అరుంధతి కూడా వచ్చే ఉంటుంది అని మంగళ అనుకుంటుంది. నా కూతుర్ని కష్టాలపాలు చేశాను జీవితంలో క్షమించరాన్ని తప్పు చేశాను అని రామ్మూర్తి పశ్చత్తాప పడతాడు.ఏవండీ ఈ మధ్యనే మీకు ఆరోగ్యం బాగోలేదు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడడం అవసరమంటావా బాబు నువ్వు వెళ్ళిపో అని మంగళ అంటుంది.
అతని బాధ చూసిన అరుంధతి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. బాలిక ఆగుము అంటూ గుప్తా వెళ్ళిపోతాడు. కచ్చితంగా ఇతని వెంట అరుంధతి కూడా వచ్చింది వెంటనే మనోహరి కి చెప్పాలి అయినా చెప్పిన ఏం లాభం లేదు డబ్బులేమనిస్తుందా అని మంగళ ఊరుకుంటుంది.కట్ చేస్తే,మనోహరి ఒక అడుగు ముందే వేసింది నేనే వెనకడుగు వేశాను తన ప్లాన్ ఏంటో కనిపెట్టలేకపోయాను ఏం చేయాలి అని ఆలోచిస్తుంది భాగమతి. ఏంటి మిస్సమ్మ ఒక్క దెబ్బకే చాప పిల్లో కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టుకుంటున్నావా ఈ మనోహరితో ఎందుకురా
పెట్టుకున్నారు అనుకుంటున్నావా ఈ ఒక్క దెబ్బకే ఇలా అయిపోతే నాలుగైదు దెబ్బలు తగులుతాయి అప్పుడు ఎలా తట్టుకుంటావు మిస్సమ్మ చూస్తూ ఉండు ఏం చేస్తానో అని మనోహరి అంటూ ఉండగా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం వస్తుంది. రండి మేడం అని మనోహరీ అమరేంద్ర దగ్గరికి తీసుకు వెళుతుంది మేడంని. మేడం నీ పిలిపించింది అంటే మనోహర్ ఎదో చేయబోతుంది పిల్లల్ని దూరం చేస్తుందా అని వెళ్తుంది భాగమతి. కట్ చేస్తే, ఏంటి మేడం ఇలా వచ్చారు అని అమరేంద్ర అంటాడు. పిల్లలు మీ మేడం వచ్చింది రండి అని శివరామ్ పిలుస్తాడు. అంజలి నువ్వు ఏమైనా చేసావా అని అమృత అంటుంది.
స్కూలే లేదు ఇక నేనేం చేస్తాను అని అంజలి అంటుంది. మీతో మాట్లాడడానికి వచ్చాను అని మేడం అంటుంది. నాతోటి ఏంటో చెప్పండి మేడం అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదు సార్ పిల్లలకి సంబర సెలవుల్లో టూర్ ప్లాన్ చేసాం అలాగే అకాడమీ కూడా ప్లాన్ చేస్తున్నాం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను అని మేడం అంటుంది. పిల్లలు ఏటూరుకు రారు వాళ్ళ సదువు విషయం అంటారా ఇక నేను చూసుకుంటాను అని భాగమతి అంటుంది. మిస్సమ్మ నువ్వు పిల్లలకు తల్లివి కాదు కేర్ టేకర్ వి ఈ విషయమైనా అమర్ తీసుకుంటాడు నువ్వు చెప్పు అమర్ అని మనోహరి అంటుంది.నాకు కూడా పిల్లలని పంపించడం ఇష్టం లేదు ఇక చదువు విషయం అంటారా మిస్సమ్మ చూసుకుంటుంది అని అమరేంద్ర అంటాడు. అమర్ నీతో మాట్లాడాలి అని మనోహరి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!