Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 9వ వారం ఆట సాగుతోంది.ఎనిమిదవ వారంలో ఆట సందీప్ ఎలిమినేట్ కావడం తెలిసిందే. వాస్తవానికి శోభా ఎలిమినేట్ కావాల్సిందని.. ఆమెకు బదులు సందీప్ నీ ఎలిమినేట్ చేశారని బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు. కావాలని శోభా శెట్టినీ షో నిర్వాహకులు సేవ్ చేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె మేనేజ్మెంట్ కోట అని కామెంట్లు చేస్తున్నారు. అందువల్లే ఆమె తోటి కంటెస్టెంట్లపై నోరు జారుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. డ్రాగన్ స్నేక్ టాస్క్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ జరగగా మొత్తం 8 మంది నామినేషన్ లోకి రావడం జరిగింది. వాళ్లు వివరాలు చూస్తే అర్జున్, ప్రిన్స్ యావర్, భోలే షావలి, అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, ప్రియాంక. అయితే వీరిలో ఓటింగ్ లో అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత భోలే, అమర్ దీప్, అర్జున్ భారీ ఎత్తున ఓట్లు రాబడుతున్నారు. ఈ క్రమంలో శివాజీ, ప్రశాంత్, అశ్విని నామినేషన్ నుండి తప్పించుకోగా కెప్టెన్ గా గౌతమ్ ఉండటంతో అతను కూడా తప్పించుకున్నాడు.
ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్, శివాజీ లను నామినేట్ చేయడానికి ఇంటి సభ్యులు అసలు సాహసించడం లేదు. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియలో ఒక్క అమర్ దీప్ మాత్రమే ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే యావర్ మొదటి నుండి భారీ ఎత్తున ఓట్లు రాబడుతున్నాడు. కచ్చితంగా మనోడు టాప్ 5 లోకి వెళ్తారని జనాలు చెబుతున్నారు. కచ్చితంగా ఈసారి సీజన్ లో శివాజీ, ప్రశాంత్, యావర్ ఈ ముగ్గురుకి టాప్ ఫైవ్ లో బెర్త్ లు ఖాయం అని అంటున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!