Anushka Shetty: “బాహుబలి” సినిమా విజయంతో ఒక్కసారిగా అనుష్క గ్రాఫ్ అమాంతం పెరిగింది. కానీ ఆ సమయంలో “సైజ్ జీరో” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా కోసం బాగా లావు అవటం జరిగింది. ప్రయోగాత్మకంగా అనుష్క చేసిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం చాలా నెలలు అనుష్క సినిమాలు రాలేదు. ఇటువంటి పరిస్థితులలో ఇటీవల “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో ఆకట్టుకోవటం జరిగింది. ఈ సినిమా విజయంతో ఇప్పుడు స్వీటీ అనుష్కకి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో భాగంగా.. భారీగా ఆఫర్లు తెలుగులో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా వస్తున్నాయట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా అనుష్క హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. దీంతో మళ్లీ చాలాకాలం తర్వాత అనుష్కకి వరుస ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని టాక్. ఆ ముగ్గురిలో అనుష్క ఒకరని ప్రచారం జరుగుతుంది.
సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ సినిమా మూడు లోకాలు చుట్టూ తిరిగే కదా అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇందులో విలన్ పాత్రలో రానా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందులో కాజల్ అగర్వాల్, మ్రణాల్.. పేర్లు తెరపైకి వచ్చాయి వీటితోపాటు మరి కొంతమంది హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే వారిలో అనుష్క ఒకరు ప్రజెంట్ టాక్. గతంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవితో ఫుల్ లెంగ్త్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.