Trinayani April 22 2024 Episode 1219: అది అర్థం కాక నాకు తలనొప్పి వస్తుంది అని తిలోత్తమ అంటుంది. మా అక్క కి తలనొప్పి రావాలి కానీ నీకు తలనొప్పి రావడం ఏంటి అత్తయ్య గారు అని సుమన అంటుంది. నువ్వు తప్ప అందరూ ఐశ్వర్యవంతులే సుమన అని తిలోత్తమ అంటుంది. నాకు టైం రాకపోతుందా నేను రిచ్ కాలేదు అత్తయ్య అని సుమన అంటుంది.మీ అక్క చేసే పనికి పిచ్చి వాళ్ళం అయ్యేలా ఉన్నాం అని వల్లభ అంటాడు. బావగారు గాయత్రి అత్తయ్య గురించి తెలుసుకోవాలని ఉందా లేదా అని సుమన అంటుంది. ఇప్పుడు సీరస్ లేని పూజ మీ అక్క చేస్తుందా అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడు అ పూజ జరగకుండా మనం చేయాలి అని సుమన అంటుంది. చాలా కోపంగా ఉన్నట్టున్నావే అని తిలోత్తమ అంటుంది. నేనేమో పాము పిల్లని పెంచుకోవాలా మా అక్క ఏమో కన్న కూతురు కనిపించకపోయిన శాస్త్రి గారి మనవరాలుని దత్తత తీసుకొని కోట్ల ఆస్తికి వారాసులు ని చేస్తారా అని సుమన అంటుంది.
ఆ విషయంలో నీకు అన్యాయం జరిగి నట్టే సుమన అని తిలోత్తమ అంటుంది. అందుకే ఈ పూజ జరిగిన ఫలితం నాకు వచ్చేలా చేసుకుంటాను అని సుమన అంటుంది. ఎలా చేస్తావ్ సుమన అని వల్లభ అంటాడు. చూస్తారు కదా బావగారు అని సుమన అంటుంది. కట్ చేస్తే,పూజకి అందరూ రెడీ అయి కూర్చుంటారు. మీ అమ్మ ఎలా ఉంది అని సుమన అడుగుతుంది. మా అమ్మకి ఏమైంది వదిన అని విక్రాంత్ అంటాడు. మీ అమ్మ మనశ్శాంతిగా ఉంటే ఊరుకోదు కదా అని హాసిని అంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం జరిగిందని అలా అంటున్నావ్ అక్క అని నైని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ పూజకి ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు అని విక్రాంత్ అంటాడు. విశాల్ బాబు గారు అని డమ్మక్క అంటుంది. ఈ పూజ వల్ల గాయత్రి ఎక్కడ ఉందో తెలుస్తుంది అని డమ్మక్క అంటుంది. అందుకే నాకు టెన్షన్ గా ఉంది అని హాసిని అంటుంది. ఎందుకక్కా అని నైని అంటుంది. ఊరికే అన్నాను చెల్లి అని హాసిని తప్పించుకుంటుంది.
ఎవరి ప్రయత్నం వాళ్ళది అని డమ్మక్క అంటుంది. గుడికి వెళ్లలేకపోయానని అనుకున్నాను కానీ పూజ చేస్తే గాయత్రి అమ్మగారి గురించి తెలుసుకుని అవకాశం వచ్చింది అందులో డమ్మక్క సహాయం చేసింది అని నైని అంటుంది. అది సరేగాని విశాలాక్షి ఎక్కడ అని విక్రాంత్ అంటాడు. అందరూ పూజ ఎలా చేస్తారని ఆలోచిస్తుంటే అమ్మ మాత్రం తలపెట్టింది అని డమ్మక్క అంటుంది. ఎందుకు అని హాసిని అంటుంది. అక్క తలపెట్టడం అంటే పూజకి ఏర్పాటు చేస్తుందని అర్థం అని నైని అంటుంది. కట్ చేస్తే, అందరూ పూజ దగ్గరికి వస్తారు. విశాల్ బాబు పూజ అంతా సిద్ధమేనా అని డమ్మక్క అడుగుతుంది. అన్ని సిద్ధం మీరు మొదలు పెట్టడమే ఉంది అని విశాల్ అంటాడు. ముందు అమ్మవారు ఉండాలి కదా అని వల్లభ అంటాడు . అమ్మవారు ఉందన్నయ్య తను దర్శనమిస్తే తట్టుకోలేరని పరదా కట్టాను అన్నయ్య అని విశాల్ అంటాడు. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో గారడి చేస్తున్నట్టు ఉంది అని సుమన అంటుంది.
బ్రో అమ్మవారి పూజ వల్ల పెద్దమ్మ జాడ ఈరోజు తెలిసిపోతుంది అని విక్రాంత్ అంటాడు. విశాల్ చిన్న స్మైల్ ఇస్తాడు. నైని పూజ అనగానే ఇలాగైనా చేసి తీరుతుంది అని నమ్మకంతోటే రెడీ అయి వచ్చాము అని తిలోత్తమ అంటుంది. అమ్మ దర్శనం కానివ్వండి అని డమ్మక్క అంటుంది. బాబు గారు పరదా తీయండి అని నైని అంటుంది. అందరూ చూడండి పరద తీస్తాను అని విశాల్ పరదా తీస్తాడు. తల లేని అమ్మవారిని చూసి అందరూ షాక్ అయిపోతారు. విశాలాక్షి మాత్రం ఒకచోట కూర్చొని ఓం నమశివాయ అనే అష్టాక్షరి మంత్రని జపం చేస్తూ ఉంటుంది. వీళ్ళకు మాత్రం తల లేని అమ్మవార్ల కనిపిస్తూ ఉంటుంది. కల్లార్పకుండా అమ్మవారిని చూస్తే నీ కళ్ళు శుభ్రం అవుతాయి అని హాసిని అంటుంది. ఇదేంటి మమ్మీ ఇలా చేశారు అని వల్లభ అంటాడు. అమ్మవారిని చెప్పారు అని తిలోత్తమ అంటుంది. అమ్మవారిని చెప్తున్నారత్తయ్య అని సుమన అంటుంది. మీకు దీనివల్ల నీకు భక్తి భావం లేదని తెలుస్తుంది అని నైని అంటుంది.
శిరస్సులేని అమ్మవారిని చెప్పి తల ఉండే చోటా చెట్టు పెట్టారు ఏంటి అని వల్లభ అంటాడు. అది చెట్టు కాదు బ్రో ఉసిరి తోట అని విక్రాంత్ అంటాడు. సిరిసిలేని అమ్మవారు ఎలా ఉంటుందని చెబితే తులసి తోట అని చెప్పింది విశాలాక్షి అని నైని అంటుంది. చీర కట్టి తల స్థానాల చెట్టు పెడితే అమ్మవారు అయిపోతుందా అని సుమన అంటుంది. నీకు అక్కడ అమ్మవారి కనిపించడం లేదా అని నైని అంటుంది. చిట్టి నువ్వు నమ్మితే నమ్ము లేదంటే లేదు ఇతడవాదం చేయకు అని హాసిని అంటుంది. అమ్మవారి ఎవరనేది కాదు మాకు గాయత్రి అక్క రావడం ముఖ్యం అని తిలోత్తమ అంటుంది. ఏంటి ఇప్పుడు పూజ చేస్తే పెద్దమ్మ రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందా అని వల్లభ అంటాడు. కచ్చితంగా వస్తుంది నైని అంటుంది. అలా జరిగితే నువ్వు చెప్పినట్టు చేస్తాను అక్క అని సుమన ఉంటుంది. ఇంతకుముందు కూడా పందెం కట్టి ఓడిపోయావు అని హాసిని అంటుంది. నైని నమ్మకం గెలుస్తుందా సుమన గెలుస్తుందా చూడాలి అని తిలోత్తమ అంటుంది. గాయత్రి వీళ్ళు పూజ చేస్తారు మనం లోపలికి వెళ్దాం రా అని హాసిని అంటుంది. ఇక్కడ పూజ చేస్తుంటే పాపని తీసుకొని వెళ్తానంటే ఏంటి ఉండనివ్వు అని తిలోత్తమ అంటుంది.
గాయత్రి పాప ఇక్కడే ఉంటే వచ్చే గాయత్రి అత్తయ్య కన్ఫ్యూజ్ అవుతారు కదా అని హాసిని అంటుంది. నీ మాటలకి వాళ్లకి ఏమీ అర్థం కావట్లేదు వదిన అని విశాల్ అంటాడు. ఏదైనా కీడు జరిగితే నీకు తెలుస్తుంది కదా నైని అని తిలోత్తమ ఉంటుంది. అక్కడ అమ్మ తపస్సులో ఉంది ఇక్కడ ఏం జరిగినా అమ్మ చూసుకుంటుంది అని డమ్మక్క అంటుంది.అని పూజ చెయ్యి అని విశాల్ అంటాడు.నైని దీపారాధన చేస్తుంది. ఎర్రటి నీళ్లు ఎత్తేస్తాను దిష్టి తగులుతుంది అని హాసిని వెళుతుంది. మావయ్య నువ్వు అద్దం తీసుకురా అని విశాల్ అంటాడు. అద్దం ఎందుకు అని తిలోత్తమ అడుగుతుంది. అమ్మవారి ప్రతిబింబాన్ని తను చూసుకుంటుంది అని విశాల్ అంటాడు. గుడిలో అలా చేస్తారు కానీ ఇంట్లో కూడా చేస్తారా అని సుమన అంటుంది. మీలాంటి వాళ్ళు చూస్తే అమ్మవారి కూడా దిష్టి తగులుతుంది కాబట్టి అలా చేయాలి అని విక్రాంత్ అంటాడు. హాసిని ఎర్రటి నీళ్లు తెస్తుంది. పావన మూర్తి అద్దం తీసుకుని వస్తాడు. నైనీ పూజ మంచిగా చేసి గాయత్రి అక్క దొరికేలా మనసు పూర్తిగా కోరుకో అని తిలోత్తమ అంటుంది. పెద్ద మరదలు గాయత్రీ పెద్దమ్మ కోసం ఆరాటపడుతుంటే వీళ్లేమో దిష్టి తగులుతుంది అనే కంగారు పడుతున్నారు మమ్మీ అని వల్లభ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది