Trinayani March 20 2024 Episode 1193: పెద్దమ్మ గారికి హాని తలపెట్టాలని నేనెందుకు అనుకుంటాను చెల్లి అని నైని అంటుంది. దీనికి మాటలతో చెప్తే వినేలా లేదు వదిన అని విక్రాంత్ అంటాడు. కావాలంటే పోలీసులు పిలిపియ్యండి అప్పుడు మా అక్కని పట్టుకెళ్తారు అని సుమన అంటుంది. వదిలేయండి బాబు గారు అని నైని అంటుంది. పోలీసులు పట్టుకెళ్తారు అనేసరికి వదిలేయమంటున్నావా అక్క అని సుమన అంటుంది.చూసావా వదిన అది నీ మీద ఎన్ని నిందలు వేయాలని చూస్తుంది అని విక్రాంత్ అంటాడు. దాని మాటలు పట్టించుకోకు విక్రాంత్ బాబు అని నైని పోతుంది. కట్ చేస్తే అఖండ స్వామి ఇచ్చిన మూలిక లలితాదేవిపై ప్రయోగించాలనుకుంటారు తిలోత్తమ వల్లభ. ఈసారి ప్లాన్ రివర్స్ అయిందో నీ సంగతి చెప్తాను ఇంతకు ముందు నాకే వాసన చూపెట్టి చేసావ్ అనుకో బాగోదు అని తిలోత్తమ వల్లభని కోప్పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటావు అమ్మ అని వల్లభ అంటాడు. అఖండ స్వామి ఏం చెప్పాడురా ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని తిలోత్తమ అంటుంది.
మూలిక తీసుకువెళ్లి గాయత్రి పాప మీద పడేటట్టు వేయండి అప్పుడు లలితా దేవికి గాయత్రి పాపకి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది అన్నాడు. మళ్లీ దీన్ని ఇంతకు ముందు చేసినట్టు తెలివి తక్కువ పని చేయకండి అని అఖండ స్వామి అంటాడు. కానీ ఈ మూలిక వాసన చూసి నాగయ్య పాము స్పృహ కోల్పోతాడు కానీ నాగయ్య జోలికి వెళ్ళకండి మీ పనేదో మీరు చేసుకోండి అని అఖండ స్వామి చెబుతాడు. సరే గురువుగారు అని తిలోత్తమ వాళ్ళు వెళ్ళిపోతారు. మమ్మీ అఖ0డ స్వామి ఆ వాసన చూసి నాగయ్య పడిపోతాడు అన్నాడు కదా అని వల్లభ అంటాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు మనం గాయత్రీ పాప మీద లలితక్క రక్తం పడిన గుడ్డ పైన పెట్టి ఉంచాం ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో పెడతాను నువ్వే చూస్తావు ఏం జరుగుతుందో అని తిలోత్తమ ఆ మూలికని తాంబలంలో పెడుతుంది. ఇంతలో నాగయ్య అక్కడికి వస్తాడు.
పాముని చూసి పక్కకు తప్పుకుంటారు తిలోత్తమ వల్లభ. నాగయ్య వచ్చి మూలిక వాసన చూసి ఆ తాంబూలం చుట్టూ చుట్టుకొని మూలిక మీద పడుకుంటాడు. తిలోత్తమ ఆ తాంబలంలో బియ్యం పోచేస్తుంది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావ్ అని వల్లభ అంటాడు . లలిత దేవి అనాధ పిల్ల పేరు రాయాలని చూస్తుంది అప్పుడు స్పృహలోకి వచ్చిన నాగయ్య లేచి లలితా దేవిని కాటేస్తాడు అని తిలోత్తమ అంటుంది. ఏమీ తెలియనట్టు మళ్లీ తిలోత్తమ వల్లభ అందరిలో కలిసి ఉంటారు. కట్ చేస్తే, అందరూ నామకరణం చేసే దగ్గరికి వస్తారు. ఏం చేస్తున్నారు అని లలితాదేవి అంటుంది. ఏమీ లేదు పెద్ద వదిన పొద్దుపోక వుసులాడుకుంటున0 అని దురంధర ఉంటుంది. ఇప్పుడు బాగా మాట్లాడుకుంటార్లే సుమన అని వల్లభ అంటాడు. పాపకి కొత్తగా పేరేమి పెట్టడం లేదు దేవి అని అక్షరం మాత్రమే పక్కన చేరుస్తున్నారు అని విక్రాంత్ అంటాడు. అయితే ఆ నామకరణానికి కొత్తగా ఏం చేస్తున్నారో చెప్పొచ్చుగా అని సుమన అంటుంది.
విక్రాంత్ బాబుకి తెలియదని నువ్వు అడుగుతున్నా అవసరమా అని నైని అంటుంది. ఆల్రెడీ పేరు పెటీనా పాపకి మళ్లీ ఎలాంటి పద్ధతి వాడాలో తెలుసా అని అడుగుతున్నాను అని సుమన అంటుంది. నీకు తెలిస్తే చెప్పు సుమన అని విశాల్ అంటాడు. శంకర శాస్త్రి మనవరాలు కాబట్టి నీకు అర్థం అయ్యే ఉండాలి అని లలితాదేవి అంటుంది. నాకు అర్థం కాలేదు పెద్దమ్మ అని వల్లభ అంటాడు. వ్యవహార హేతువైన శుభకార్యం మనసుతో ఆచరిస్తే చాలు అని అర్థం అన్నయ్య అని విశాల్ చెబుతాడు. అమృత ఘడియలు నడుస్తున్నాయి త్వరగా పేరు పెట్టేస్తే మంచిది అని దురంధర అంటుంది. హాసిని లాయర్ గారు ఇచ్చిన పేపర్లు తీసుకురా అని లలితాదేవి అంటుంది. బియ్యం మీద కూడా పేరు రాస్తారు గా అని దురంధర అంటుంది. బియ్యం కూడా పట్టుకొస్తాను పిన్ని అంటూ హాసిని వెళ్ళిపోతుంది. పెద్దమ్మ ఈరోజు నామకరణం ఒకటి చేస్తే చాలు పేపర్ల మీద సంతకాలు ఎప్పుడైనా పెట్టొచ్చు అని విశాల్ అంటాడు.
బొటనవేలు కోసుకుపోయింది కదా పెద్దమ్మ గారు అని అంటుంది నైని. కత్తి పట్టుకుని రాకపోతే బాగుండని ఇప్పటికి అనుకుంటున్నావా అని సుమన అంటుంది. జరిగిపోయిన దాన్ని గుర్తు చేస్తే మనం కూడా ఇబ్బంది పడతాం అని తిలోత్తమ అంటుంది. పెద్దమ్మ మాటంటే మాటే కదా మమ్మీ అని ఆస్తి గాయత్రీ పాప పేరు మీద రాయించినట్టే కదా అని వల్లభ అంటాడు. నాకన్నా మీరే ఉత్సాహంగా ఉన్నట్టున్నారు అని లలిత దేవి ఉంటుంది. అనాధ పిల్లకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా ఆనందమే కదా అక్క అని తిలోత్తమ అంటుంది. ఇంతలో ఆస్తి పేపర్లు తాంబలం లో ఉన్న బియ్యం తీసుకొని వస్తుంది. గాయత్రి ఈలోగా నువ్వు ఆ కుర్చీలో కూర్చో అని పాపని కుర్చీలో కూర్చోబెడుతుంది నైని . చిన్న కుర్చీ సింహాసనం లాగా ఉంది బుల్లి గాయత్రి అని దురంధర అంటుంది. ఆస్తి తనమీద రాశాక ఇంటికి మహారాణి అవుతుంది అని పవన మూర్తి అంటాడు. ఇంతలో హాసిని బియ్యం పత్రాలు పట్టుకొని వస్తుంది.
అందులో ఉన్న నాగయ్య లేచి లలిత దేవి ని కాటేస్తడు అని తిలోత్తమ అనుకుంటుంది. ఇంకా పాము బతికే ఉందా లేచిందంట పెద్దమ్మ చచ్చిపోయినట్టే అని వల్లభ అనుకుంటాడు. హాసిని గాయత్రి మీద కిరీటం పెట్టి పట్టాభిషేకం చేయాలి ప్లేట్ ఎక్కడ పెట్టు అని లలితా దేవి అంటుంది. అది విని సుమన వెకిలి నవ్వు నవ్వుతుంది. ఎందుకు నవ్వు సుమన చెప్పు అని విశాల్ అంటాడు. చెబితే సుమన చెంప పలుకుతుంది అని విక్రాంత్ అంటాడు.పెద్దక్క ఉండగా సుమన మీద ఎవరు చేయి చేసుకుంటారు అని తిలోత్తమ అంటుంది.ముందు ఆ విషయం ఏంటో చెప్పమ్మా అని పావన మూర్తి అంటాడు. ఈ పిల్ల గుడిలో ఉంటే వాళ్ళ తాత చేత శతగోపురం పెట్టించుకునేది కానీ ఇవ్వాలా కిరీటం పెట్టించుకుంటుందని నవ్వొచ్చింది అని సుమన అంటుంది. ఉలోచిగూడ పగలు పాముల ఉండుంటే నిన్ను విడిచి నాగలోకానికి వెళ్లిపోయేది అని విక్రాంత్ అంటాడు. సుమన అన్నది నిజమే అని లలితా దేవి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!