Trinayani November 29 2023 Episode1097: సన్నగా ఉన్న ఉడుం పట్టు పడతావమ్మా నువ్వు ఇంకా నయం పాపని నేను తీసుకోలేదు అని పావని మూర్తి అంటాడు ఇప్పుడు అర్థమైందా చెల్లి ఎవరు నిన్ను రెచ్చగొడతారో వాళ్లే చావగొడతారని అని నైని అంటుంది. పెద్ద బొట్టమ్మని గాయత్రి పాపకి గండం ఉందని పిలిపించాము ఏది ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టడం తప్పే సుమన సారీ అని విశాల్ అంటాడు. మీరు సారీ చెప్పడం ఏంటి అన్నయ్య దానికి ఇంకా కళ్ళు నెత్తికెక్కుతాయి అని విక్రాంత్ అంటాడు. సుమన లోపలికి వెళ్లిపోతుంటే నీకు కళ్ళు కనిపించవు కదా పాపని ఎత్తుకొని ఎలా వెళతావమ్మా అని డమ్మక్క తీసుకొని వెళ్ళిపోతుంది. వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళిపో పెద్ద బొట్టమ్మ అని పావని మూర్తి అంటాడు. ఆగు పెద్ద బొట్టుమ్మ ఇంతకుముందు ఎవరికి కనిపించే దానిని కాదు కదా ఇప్పుడేంటి అందరికీ కనిపిస్తున్నావు అని తిలోత్తమా అంటుంది. గవ్వలు ఉన్నంతవరకు నేను అందరికీ కనపడతానమ్మా అని పెద్ద బొట్టము అంటుంది. కట్ చేస్తే.
అమ్మ మొఖానికి రాసుకునే క్రీము మెడకు రాసుకోవాల్సి వచిది కొంచెం ఆగితే నిన్ను సుమన చంపేసి ఉండేది కదా అని వల్లభ అంటాడు. ఎంతైనా సుమన ని మెచ్చుకోవాల్సిందే రా ఎందుకు అంటే పాముని తోక తొక్కితేనే కాటు వేస్తుందని భయపడతారు అలాంటిది సుమన ధైర్యంగా తన గొంతు పట్టుకుంది అంటే తను మెచ్చుకోవాల్సిందే కదరా అని తిలోత్తమ అంటుంది. తనని గొంతు పట్టి నొక్కినందుకు నువ్వు గట్టిగా మందలిస్తావు అనుకుంటే మెచ్చుకుంటున్నావేంటి మమ్మీ అని వల్లభ అంటాడు.రేయ్ ప్రతీకారం తీర్చుకుంటాను రా కానీ సుమన మీద కాదు నైని మీద తిలోత్తమా అంటుంది. అదేంటమ్మా సుమన గొంతు నొక్కి పడితే పెద్ద మరదలు మీద ఎందుకు పగ తీర్చుకుంటావు అని వల్లభ అంటాడు. రేయ్ సుమన సామాన్యంగా ఎవరి జోలికి వెళ్లదు తన జోలికి వస్తే మాత్రం ఊరుకోదు కానీ నైని అలా కాదురా పెద్ద పెద్ద బొట్టమ్మని దేనికి పిలిచింది నాగులపురం నుంచి తెప్పించిన పెట్టెలో తాళపత్రాలు ఉన్నాయి కదా అవి చదివించడానికి పిలిపించింది ఇప్పుడు మనం సుమలతో గొడవ పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అని తిలోత్తమ అంటుంది.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అమ్మ అని వల్లభ అంటాడు. తన ప్లాన్ అంతా వల్లభకి చెప్పి బాగా ఉందా ప్లాన్ అని అంటుంది.నీ అంత దారుణంగా నేను ఆలోచిస్తే నీకన్నా పెద్ద విలన్ అయ్యే వాని అమ్మ అని వల్లభ అంటాడు. రేయ్ చెప్పింది గుర్తుంది కదా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టు అని తిలోత్తమా అంటుంది. కట్ చేస్తే మధ్యాహ్నం తలలో పూలు పెట్టడానికి ఎందుకు వచ్చారు అని అంటుంది సుమన. నీ మీద ప్రేమతో తెచ్చాను అని విక్రాంత్ అంటాడు. పూలు పెడదామనుకున్నారా కళ్ళల్లో కారం కొడదాం అనుకున్నారా చూశాను కదా మీ సంగతి మధ్యాహ్నం అని సుమన అంటుంది. నీ వెటకారం ఆపుతావా అని విక్రాంత్ కింద పక్కేసుకుంటాడు. నా కళ్ళల్లో కారం కొట్టిన వాళ్లకి సంతోషం కలుగుతుందేమో కానీ వల్ల జీవితాలలో మంట పుడుతుంది చూడండి అని సుమన అంటుంది. నీ ద్వారా విశాల్ అన్నయ్యకి కానీ నైని వదినకు కానీ ఏదైనా జరిగిందంటే ఈసారి కారం కాదు నీ ప్రాణాలే పోతాయి అని విక్రాంత్ అంటాడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కానీ ఇక మీరు దయచేయండి అని సుమన అంటుంది. కట్ చేస్తే ఏంటక్కా గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నావ్ అని సుమన అంటుంది.
నాకు కనిపించే చేస్తున్నాను చెల్లి అని హాసిని అంటుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అని విక్రాంత్ అంటాడు. అబ్బా తెల్లారితే చాలు ఎప్పుడూ గొడవలతోటే మొదలవుతుంది కాసేపు ఊరుకోవచ్చు కదా అమ్మ అని పావన మూర్తి అంటాడు. అక్క హారతి ప్లేటు మంచిగా పట్టుకో కింద పడిపోతుంది అని నైని అంటుంది. మీరు అలా పూజలు చేసినంత మాత్రాన పెద్దమ్మ దొరుకుతుందా అని వల్లభ అంటాడు. గాయత్రి ఎక్కడ ఉందో మాకు తెలుసు అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య మీకు గాయత్రి అమ్మగారు ఎక్కడ ఉందో తెలుసా అని నైని అంటుంది. తిలోత్తమ అలా అనగానే విశాల్ షాక్ అయిపోతాడు. ఇంకా అమ్మగారిని అంటున్నావు కానీ గాయత్రి అక్క నీ పెద్ద కూతురు నైని అని తిలోత్తమా అంటుంది. గాయత్రి అమ్మగారు ఎక్కడ ఉందో అని తెలిస్తేనే నా గుండె చూడండి ఎలా కొట్టుకుంటుందో తనని ఎప్పుడు చూడాలని తహతహలాడుతుంది అని నైనా అంటుంది. మీ అమ్మగారు మరో జన్మ ఎత్తి నీకు కూతురుగా పుట్టి దూరమైంది దొరుకుతుంది అంటే నీ గుండె ఆ మాత్రం కొట్టుకుంటుందిలే పెద్ద మరదలా కానీ తను ఎటువైపు ఉందో మాకు తెలుసు అని వల్లభ అంటాడు
ఎటు పై ఇటువైపు ఉంది పుత్ర అని ఎద్దులయ్య గాయత్రీ ని ఎత్తుకొని వస్తాడు. ఏంటి ఎద్దులయ్య గాయత్రీ ఎక్కడ ఉందో నీకు కూడా తెలుసా అని హాసిని అంటుంది. మీరు అమ్మ గురించి వెతుకుతున్నారని నేను ఇక్కడికి వచ్చాను అమ్మ అని ఎద్దులయ్య అమ్మ ఇలా రా అని పిలుస్తాడు. ఎవరా అని అందరూ గణము వైపు చూస్తారు. అక్కడి నుంచి విశాలాక్షి రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. అమ్మ వచ్చింది చూడండి అని డమ్మక అంటుంది. మా అక్క వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతుంటే శివ భక్తులు వాళ్ళ అమ్మని తోలుకొచ్చారు రెండు బస్తాల బియ్యం అయిపోయిందాక ఇక్కడే ఉంటారు అని సుమన అంటుంది. నువ్వేమీ వండి పెట్టట్లేదు కదా ఎందుకు నీకు ఇబ్బంది ఊరుకో అని విక్రాంత్ అంటాడు. మీరు అందరూ గాయత్రి అమ్మ కోసం వెతుకుతున్నారు అని తెలిసి వచ్చాను మీకు ఆ కూతురు మీద ఎంత ప్రేమ అమ్మ తనని ఎత్తుకోవాలని అంత ఆరాట పడిపోతున్నారు అని విశాలాక్షి అంటుంది.
కానీ నిన్ను కనలేదు కదా తను ఎత్తుకోవడానికి అని తిలోత్తమ అంటుంది. పేగు తెంచుకొని పుట్టకపోయిన ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు తన పేగు పంచుకొని పుట్టిన కూతురు ని ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటారో అని విశాలాక్షి అంటుంది. అవును విశాలాక్షి గాయత్రీ నాకు తెలుసు అని అంటే వీళ్ళు ఎవరు నమ్మట్లేదు కానీ నువ్వు నా మాటని నమ్ముతున్నావు అది చాలు నాకు అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పాప ఎక్కడ ఉందో మీకు నిజంగానే తెలుసా అమ్మ తీసుకువస్తారా అని ఎద్దులయ్య అంటాడు. ఎద్దులయ్య ఎవరి ప్రయత్నం వాళ్ళని చేయని ఎందుకు మనం చెడగొట్టడం అని విశాలాక్షి అంటుంది. కార్యం సఫలం కాకపోతే ఎలాగమ్మా అని ఎద్దులయ్య అంటాడు. డిన్ఏ టెస్ట్ చేసినా కూడా విశాల్ నైనిలకన్న కూతురు అని తెలుస్తుంది అందులో ఎటువంటి డౌటే లేదు అని తిరోతమ అంటుంది.
మీరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు అత్తయ్య అక్క వాళ్ళ కూతురే అని నీకు కచ్చితంగా ఎలా తెలుసు అని సుమన అంటుంది. రాక్షసి కావాలనే ఇరికిస్తుంది నా చేతిలో ఉన్న గాయత్రి పాపనే గాయత్రి అత్తయ్యని చెప్పే పరిస్థితి ఉన్న చెప్పలేను ఎలా ఇరకటం లో పెట్టింది చూడు తనకి ఏమొస్తుందో ఏమో అని హాసిని తన మనసులో అనుకుంటుంది. ఎప్పుడెప్పుడు గాయత్రి అక్కను చూద్దామా అని మనసు లాగుతుంది అమ్మ వెళ్లి త్వరగా తీసుకురండి అని పావన మూర్తి అంటాడు. బాబు గారు ఈరోజు మన కన్న కూతుర్నే చూస్తాము తను ఈరోజు మన ఇంటికి వస్తుంది అని నైని సంబరపడిపోతుంది. గాయత్రి ఇంట్లోనే ఉందని చెప్పలేని విశాల్, అలాగే నైని పాప తిరిగి వస్తుందంటే అంతకంటే సంతోషం ఏముంటుంది అని విశాల్ టెన్షన్ పడుతూ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!