Diabetes: ప్రతి పది మందిలో ఏడుగురు డయాబెటిస్ తో బాధపడుతున్నవారే..! ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సిందే..! షుగర్ కు ఇప్పటివరకు ఖచ్చితమైన మందు అంటూ ఏమీ లేదు..! తాజాగా చేసిన పరిశోధనలలో పొడపత్రి మొక్క ఆకుల రసం అర గంటలో డయాబెటిక్ లెవల్స్ ను తగ్గిస్తుందని తేలింది..!
గుర్మార్ అనేది ఆయుర్వేద వైద్యంలో వేల సంవత్సరాలుగా ఉపయోగించే తీగ జాతికి చెందిన మొక్క ఈ మొక్కలు ఆయుర్వేదంలో మలేరియా, పాముకాటు చికిత్సకు ఉపయోగిస్తారు. పొడపత్రి మొక్క ని ఇంగ్లీష్ లో గుర్మార్ అని పిలుస్తారు. అయితే ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని తేలింది. ఇది చక్కెర తినాలనుకునే ఆలోచనను కూడా తగ్గిస్తుంది. శరీరంలో చక్కెర, కొవ్వు శోధించబడే రేటు ను కూడా తగ్గిస్తుంది. ఈ ప్రభావాలు 30 సెకండ్ల లోపు ప్రారంభమై అరగంట వరకు ఉంటాయి. జిమ్నెమా సిల్వెస్ట్తే హైపోగ్లైకేమియాకు కారణం కాకుండా గ్లూకోస్ తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
గుర్మార్ ఆకులలో డయాబెటిక్ గుణాలు ఉన్నాయని మధుమేహం ఉన్న వ్యక్తులపై 18 నుంచి 20 నెలలపాటు ప్రతిరోజూ 400 మిల్లీగ్రాముల గుర్మార్ ఆకుల రసాన్ని తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లో 29 శాతం తగ్గుదల కనిపించిందని పరిశోధనలు వెల్లడించాయి. గుర్మర్ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ అనే రసాయనం ఉంది. ఇది ఇది చక్కెర రుచిని అణిచి వేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆకుల రసం తాగిన 30 సెకండ్స్ నుంచి అరగంట వరకు ప్రభావాలు కనిపిస్తాయి అని పరిశోధకులు వివరించారు.