పెళ్లి వరకు చాలా నాజూగ్గా ఉండే అమ్మాయిలు పెళ్లి అనంతరం కేవలం 1, 2 సంవత్సరాలలో లావుగా అయిపోతున్నారు. నిజానికి ఇలాంటి మార్పు 60 నుంచి 70 శాతం అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. చాలా మంది భర్తలు తమ భార్యలపై చేస్తున్న ఫిర్యాదు ఏమనగా సన్నగా, నాజుగ్గా ఉందని పెళ్లి చేసుకుంటే నాతో పెళ్లి జరిగాక కొద్ది రోజులకు ఇలా అయిపోయింది అంటూ దెప్పి పొడుస్తున్నారు.
అయితే అధిక బరువు అనేది అత్తారింటికి వచ్చాక కూర్చుని తింటే వచ్చింది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. లైంగిక కలయిక వలన వారి హార్మోన్లలో తేడా వచ్చి లావు అవడానికి ప్రధాన కారణమవు తుందని చెబుతున్నారు.శారీరక కలయిక కారణంగా అమ్మాయిలు నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారని వారు తెలియజేస్తున్నారు.అయితే అది ఒక్కటే కారణం కాకపోవచ్చు. అప్పటివరకు పుట్టింట్లో తీసుకున్న ఆహారానికి, అత్తారింటికి వచ్చాక తీసుకునే ఆహారానికి చాలా మార్పులుఉండడం తో శరీరంలో మార్పులకు దారి తీసుతున్నాయి అని వారు తెలియజేస్తున్నారు. పెళ్లయ్యాక అమ్మాయిలకు బాధ్యతలు పెరగడంతో వారు ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే తినే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఒకే సమయానికి ఆహారం తీసుకోక పోవడం అలాగే పిల్లలను కనడానికి ఆపరేషన్, పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆలనా పాలనా తో సరైన నిద్ర లేకపోవడం వంటి కొన్ని ప్రక్రియలు శరీర బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి . అయితే అలా లావుగా అవ్వకుండా ఉండాలంటే సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుని యోగా వ్యాయామం లాంటివి చేస్తే సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.ఒక వేళా బరువు పెరగడం అనేది భర్తకు సమస్యగా లేనప్పటికీ వ్యక్తి గతంగా మీకు మంచిది కాదని గుర్తుపెట్టుకుని బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు .