నకిలీ అధికారి శ్రీనివాస్ నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడిని ఢిల్లీ సీబీఐ కోర్టులో హజరుపర్చారు. నిందితుడి నుండి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోయామనీ, 1100 పోన్ కాల్ రికార్డులు ఉన్నాయనీ, వాటిని పరిశీలించాల్సి ఉందని, నిందితుడిని విచారించేందుకు మరింత సమయం కావాలని సీబీఐ కోరింది. ఈ కేసులో ఆరుగుని ప్రశ్నించామనీ, కొందరు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించాల్స్సి ఉందని తెలిపారు. సీబీఐ తరపున వాదనలు విన్న కోర్టు.. పోలీస్ కస్టడీని తిరస్కరించింది. శ్రీనివాస్ కు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహర్ జైలుకు తరలించారు. ఈ నెల 16వ తేదీ వరకూ శ్రీనివాస్ జైలులో ఉండనున్నారు.
ఏపిలోని విశాఖ జిల్లా చిన్న వాల్తేర్ కిర్లంపూడికి చెందిన శ్రీనివాస్ తాను సీనియర్ ఐపీఎస్ (సీబీఐ) అధికారిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్ చేయిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్ లను అడ్డాగా చేసుకుని సెటిల్మెంట్లు చేయించారు. అయిదు సంవత్సరాలుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాస్ .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ 419, 420 కింద కేసులు నమోదు చేశారు.