corona: కరోనా థర్డ్ వేవ్ తప్పకపోవచ్చన్న హెచ్చరికలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కొవిడ్ చికిత్స ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచిస్తు ఈ మేరకు రూ.1,827 కోట్లను కొవిడ్ అత్యవసర నిధి కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. తద్వారా థర్డ్వేవ్ కు ఎదుర్కునేందుకు రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సిద్ధం చేసింది.
Read More : Corona: కరోనా కలకలం.. డబ్ల్యూహెచ్వో తాజా వార్నింగ్ ఇదే…
కేంద్రం ఏం చేసిందంటే…
కొవిడ్ అత్యవసర నిధి కింద మొత్తం రూ.1,20,185 కోట్లు కేటాయించగా.. ఇందులో శనివారం 15శాతం నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. రాష్ట్రాలకు వారీగా కేటాయించిన నిధుల్లో.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.281.98కోట్లు, బిహార్కు రూ.132కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.131కోట్లు.. తెలంగాణకు రూ.44.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.62.69కోట్లు కేంద్రం కేటాయించింది.
Read More :
ఈ డబ్బులతో ఏం చేయాలంటే…
తాజాగా విడుదల చేసిన నిధులతో ఆరోగ్య వసతులను మెరుగుపరచడం ద్వారా కొవిడ్ ను సమర్థంగా నియంత్రించాలని కేంద్రం గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, బాధితులను వేరుగా ఉంచేలా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొవిడ్ చికిత్స కేంద్రాల్లో బెడ్లు, పీపీఈ కిట్లు తదితర సామగ్రిని, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఆక్సిజన్ లభ్యతను తదితర అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఇచ్చింది. మొత్తంగా థర్డ్ వేవ్ కు కేంద్రం సన్నద్ధం చేసింది.