కృష్ణా జిల్లా నుండి విశాఖపట్నం వెళ్తుండగా మధ్యలో తుని మండలం సీతారామపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వైకాపా నేత మోకా భాస్కర్రావు హత్యకేసులో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసారు.
కాగా నేడు మేజిస్ట్రేట్ ముందు కొల్లు రవీంద్రను హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ తన నిర్ణయాన్ని తెలియజేసారు. దీంతో కొల్లు రవీంద్రను ఇప్పుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ పై తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కచ్చితంగా ఇది ప్రతీకార చర్యే అంటున్నారు.