యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు భారీ ప్రాజెక్ట్ లో ఆదిపురుష్ మేయిన్ ప్రాజెక్ట్. ఈ సినిమాని దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతుండగా బాలీవుడ్ దర్శ దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించబోతున్నాడు. లంకేష్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా ప్రస్తుతం ప్రభాస్ పక్కన సీత గా నటించబోయో హీరోయిన్ ని ఎంచుకునే పనిలో మేకర్స్ ఉన్నారట.
ఇప్పటికే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న పలువు స్టార్ హీరోయిన్స్ ని చిత్ర బృందం సీత పాత్ర కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్ కి జంటగా సీత పాత్ర లో నటింప చేసేందుకు కొన్నిపేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని ఫైనల్ చేయడం తో ఈ సినిమా కి బాలీవుడ్ హీరోయిన్ ని ఎంచుకుంటారన్న టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో ప్రభాస్ బర్త్ డే రోజు అనగా ఈ నెల 23 న క్లారిటీ రానుంది.
ఇక ‘ఆదిపురుష్’ 3-డీ లో రూపొందనుండగా టీ-సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ‘ఆదిపురుష్’ 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించి.. తమిళం – మలయాళం – కన్నడ భాషలలో పాటు పలు విదేశీ భాషల్లోకి డబ్ చేనున్నారట.
అయితే ఈ సినిమాకి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కి స్క్రిప్ట్ పర్యవేక్షణ ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి బాహుబలి ఫ్రాంఛైజీ తో తెలుగు సినిమా సత్తా చాటడానికి ప్రధాన కారణమైన విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు సమాచారం. అదే నిజమైతే ఆదిపురుష్ హాలీవుడ్ సినిమాలకి దిగదుడిపే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.