చూస్తుంటే బచ్చన్ ఫ్యామిలీని కరోనా బాగా ఇబ్బంది పెడుతోంది. నిన్న రాత్రే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించిన సంగతి తెల్సిందే. ముంబైలోని నానావతి హాస్పిటల్ లో అమితాబ్ ను ఉంచారు.
ప్రస్తుతం అమితాబ్ కోలుకుంటున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపారు. నిన్న రాత్రే ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయా బచ్చన్ కు కరోనా నెగటివ్ అని తేలింది. అయితే మళ్ళీ టెస్ట్స్ జరగగా ఈసారి ఐశ్వర్య రాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్ లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కరోనాతో ఎఫెక్ట్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది.