హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం, మానవ ఇంజనీరింగ్ మేధకు మచ్చుతునక అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రశంసించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న వేళ అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందించి సందేశాన్ని ఇచ్చారు.
‘నీరే జీవనాధారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక’ అని నాగార్జున పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ‘ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సిఎంఒలను ట్యాగ్ చేశారు.