కరోనా ఫలితంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3600 థియేటర్లు ఉండేవి ఉండేవి. కరోనా లొక్డౌన్ తర్వాత అవి కాస్త 1600లకు తగ్గిపోయాయి. అయితే ఇపుడు తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లకు పెద్ద దెబ్బ తగలనున్నది. త్వరలోనే ఈ థియేటర్ల సంఖ్య మరింతగా తగ్గనున్నట్లు సమాచారం.
తాజాగా హైదరాబాద్ లోని 10 థియేటర్లు మూతపడి షాపింగ్ కాంప్లెక్సులుగా మారిన విషయం మనకి తెలిసిందే. రానున్న రోజుల్లో మరికొన్ని థియేటర్లు గొడౌన్లుగా మారనున్నాయి. ఎందుకంటే అమేజాన్ సంస్థ తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లపై కన్నేసింది. ఆ థియేటర్లను అమెజాన్, తన గొడౌన్లుగా మార్చుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. హైదరాబాద్ ఒక్క నగరంలోనే దాదాపుగా 30 థియేటర్లను అమేజాన్ సొంతం చేసుకుని వాటిని అమేజాన్ గొడౌన్లుగా మార్చనున్నది.
రానున్న రోజుల్లో సౌత్ ఇండియా మొత్తానికి అమెజాన్ హైదరాబాద్ ని హెడ్ క్వార్టర్స్ గా చేసుకోనున్నది. కాబట్టి గోడౌన్లుగా మూతబడడానికి రెడీగా ఉన్న కొన్ని థియేటర్లను అమెజాన్ ఎంచుకుంది. ప్రస్తుతానికి ఆయా థియేటర్ యజమానులతో అమేజాన్ ప్రతినిథులు సంప్రదింపులు జరుపుతున్నారు. సినిమాల మీద వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ అద్దె చెల్లించడానికి అమేజాన్ సిద్ధమవ్వడం వలన థియేటర్ యజమానులు కూడా తమ థియేటర్లను అమేజాన్కి లీజుకి ఇవ్వడానికి రెడీ అంటున్నారు. అమేజాన్ తో పాటుగా ప్రముఖ వాణిజ్య సంస్థలు అయిన మోర్, డీ మార్ట్ లు సైతం తమ గొడౌన్లుగా థియేటర్లని ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో లాక్ డౌన్కి ముందు, ఆ తరవాత అని చెప్పుకుంటున్నాం. ఇలా లాక్ డౌన్ వల్ల చాలా మార్పులు రావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లు కన్నా ఓటీటీలకే ఎక్కువ అలవాటు పడ్డారు. రాష్ట్రంలో థియేటర్లు తెరిచినప్పటికీ ప్రేక్షకులు మాత్రం రావట్లేదు.