గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అమరావతిలో ఉద్యమం చేసే వాళ్ళు నిజమైన రైతులు కాదు అని చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ టిడిపి పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారినట్లు చెప్పుకొచ్చారు.
ఇక తిరుపతి ఉప ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ బీజేపీ జనసేన పొత్తు అనేది చాలా కామెడీగా ఉంది అని అభివర్ణించారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ కి ఒక సీటు ఇవ్వలేదు, అయినా గానీ అక్కడ పవన్ సపోర్ట్ చేశారు బిజెపిని. దీంతో పవన్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు తిరుపతి ఉప ఎన్నిక టికెట్టు జనసేన కి వస్తుందని భావించారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తే తిరుపతి ఉప ఎన్నిక టికెట్ కూడా జనసేన పార్టీకి బిజెపి ఇచ్చేటట్టు లేదు. మొత్తం మీద పవన్ రాజకీయ పరిస్థితి చూస్తే అప్పట్లో చంద్రబాబు అధికారంలోకి తీసుకు రావటానికి నానా చాకిరీ చేశారు. ఇప్పుడు బిజెపి పార్టీ కోసం అదే చేస్తున్నారు అంటే అంబటి రాంబాబు సంచలన డైలాగులు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి కూలి పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి సెటైర్లు వేశారు.