ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ కోసం ఇంటెర్న్స్ ను తీసుకుంటామని ప్రకటన జారీ చేసింది. మానేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీనికి అర్హులు. కనీస కంప్యూటర్ నాలెడ్జి, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
పై అర్హతలు కలిగిన వారు ఇంటెర్న్ కోసం ఎంజి రోడ్, విజయవాడలోని రాష్ట్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు వాక్ ఇన్ కోసం రావాల్సి ఉంది. లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరు తేదీ జులై 22. ఇది మూడు నెలల ఇంటెర్న్ కోర్సు. ప్రశంసాపత్రంతోపాటు స్టైపెండ్ గా 6వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. అన్ని అర్హతలు కలిగిన వారు పైన తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.