ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 18వ తేదీ ఏపి కేబినెట్ భేటీ జరగనున్నది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం ఒకటో బ్లాక్ లోని కేబినెట్ సమావేశ మందిరంలో మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ నెల 25న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ, కరోనా సెకండ్ వేవ్, స్థానిక ఎన్నికలు, ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధి, తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
ఎజెండా అంశాలను త్వరగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఈనెల 15 తేదీ మంగళవారం నివర్ తుఫాను నష్టాలపై తుది నివేదిక అందరు నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపైన కేబినెట్ లో చర్చించనున్నారు.