ఏపిలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీగా విఎన్ మణికంఠను బదిలీ చేసింది. కర్నూలు ఎస్ఈబీ ఏఎస్పీ గా కృష్ణకాంత్ పటేల్, కడప అడ్మిన్ ఏఎస్పీగా తుషార్, ప్రొద్దుటూరు ఏఎస్పీగా ప్రేరణ్ కుమార్, చింతూరు ఏఎస్పీగా కేవి మహేశ్వరరెడ్డి, చింతపల్లి ఏఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం, వై ప్రసాదరావు, సోమశేఖర్ లను డీజీపీ ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది.