Breaking: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై రాయితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. శనివారం రాత్రి సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆగంతకుడు రాయి విసిరారు.
గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పై భాగంలో స్వల్ప గాయం అయ్యింది. క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయ్యింది. దీంతో వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
ప్రథమ చికిత్స అనంతరం జగన్ బస్సుయాత్రను కొనసాగించారు. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ నగరంలో దాదాపు మూడున్నర గంటలుగా భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ రోడ్ వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు.
YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం