బీసీసీఐకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. బీసీసీఐకి ఉన్న గోల్డెన్ టిక్ మాయం అయ్యింది. గోల్డెన్ టిక్ మాయం కారణం బీసీసీఐ తన డీపీ (డిస్ప్లే ఫోటో) జాతీయ జండాను పెట్టుకోవడమే కారణంగా తెలుస్తొంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుండి ఆగస్టు 15 వరకూ కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తొంది. ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సోషల్ మీడియాల డీపీగా జాతీయ జెండా ను పెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం తన ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాలో ట్వీట్ చేశారు. దేశం, మన బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు. ప్రధాని సూచనల మేరకు బీసీసీఐ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా డీపీగా భారత జాతీయ జెండా ను మార్చింది. ఆ నేపథ్యంలో బీసీసీఐ కి అప్పటి వరకూ ఉన్న గోల్డెన్ టిక్ మాయం అయ్యింది.
ట్విట్టర్ కొత్త మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు తమ డీపీని మార్చినప్పుడల్లా వారి ప్రొఫైల్ బ్లూ టిక్ లేదా గోల్డెన్ టిక్ తొలగిస్తుంది. ఆ తర్వాత ట్విట్టర్ సమీక్ష జరిపిన తర్వాత టిక్ ను పునరుద్దరిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్గిగత ట్విట్టర్ ఖాతా డీపీగా త్రివర్ణ పతాకాన్ని మార్చినప్పటికీ టిక్ తొలగించలేదు. అయితే ఇతరత్రా డీపీగా త్రివర్ణపతాకాన్ని మార్చిన ఖాతాలకు మాత్రం బ్లూటిక్ మాయం అయ్యింది.
బీసీసీఐ ఇంతకు ముందు దాని ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ కల్గి ఉంది. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ లకు టేకోవర్ చేసిన తర్వాత ట్విట్టర్ మార్గదర్శకాలను మార్పు చేశారు. దృవీకరించిన వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, కంపెనీలు, వ్యాపార సమూహాలకు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు బ్లూ టిక్ బదులు గోల్డ్ టిక్ లు ఇచ్చింది. ఈ క్రమంలో స్వయం ప్రతిపత్తి కల్గిన బీసీసీఐకి గోల్డ్ టిక్ ఉండేది. అయితే డీపీగా జాతీయ జెండాను మార్పు చేయడంతో గోల్డ్ టిక్ మాయం అయ్యింది.