యాలకులు మన ఆరోగ్యానికి ఆశ్చర్యాన్ని కలిగించేంత మేలు చేస్తాయి. అందులోను రాత్రి పడుకోబోయే ముందు యాలుక్కాయ ఒక్కటి తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.
ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మనం ఎలాంటి ఔషదాలు వాడవలిసిన అవసరం ఉండదు.
ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు.. దాన్ని తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలుచేస్తుంటాము. తేలికగా గా బరువును తగ్గాలనుకునే వారు రోజూ రాత్రి యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వెచ్చని నీళ్ళు తాగడం వల్ల చాల తేలికగా బరువు తగ్గుతారు ఇంకా చెప్పాలంటే..
ప్రతి రోజు యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం నుండి చెడుపదార్ధాలు బయటకు పోతాయి. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. యాలుకా, గోరువెచ్చని నీరు అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. మనం తిన్న ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
ఈ కారణం గా అనేక మంది కి మలబద్దకం సమస్యవస్తుంది. అలాంటి వారు ఈ నియమాలను పాటించడం వల్ల మలబద్దకం సమస్య నుండిబయటపడవచ్చు.
చాలా మంది రాత్రి నిద్ర పట్టక సతమతమవుతూ ఉంటారు.. అలాంటివారు రాత్రినిద్రపోయే ముందు యాలుక్కాయను తిని గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి.
క్రమం తప్పకుండ ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే, నిద్రలేమీ సమస్య తగ్గి పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోతారు.
నిద్రలో గురక పెట్టె వారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల అది దివ్య ఔషధం లా పని చేసి నెమ్మ నెమ్మది గా నిద్రలో గురక తగ్గుతుంది. యాలుక,వేడినీరు రోజూ తీసుకోవడం వలన ఎముకలను బలంగా తయారవుతాయి.
ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.