పటికబెల్లం వలన శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తి ని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని అందిస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధం గా పనిచేస్తుంది. తియ్యగా ఉందికదా అని ఎక్కువ తినేస్తే మాత్రం మలబద్దకం వస్తుంది. పటిక బెల్లం తో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా పటికబెల్లం నీటి నితీసుకోవడం వలన
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండి అలసటగా ఉన్నవారికీ అద్భుతంగా పని చేస్తుంది. పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు తీసుకుంటూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
నోటి పుండ్లు ఉంటే , ఏలకుల పొడి,పటిక బెల్లం కలిపి పేస్ట్ తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం కొంచెం నీటి తో ఈ పేస్ట్ కలిపి త్రాగాలి. ఇలా చేయడం వలన నోటి బొబ్బలు ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి.
భోజనం చేసిన తరువాత నోరు శుభ్రపరచుకోకపొతే, ఆ బాక్టీరియా నోరు, చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన వస్తుంది. భోజనం తరవాత పటిక బెల్లం తింటే చెడు వాసన పోగొట్టి, తాజా శ్వాస ఉండేలా చేస్తుంది.
పటికబెల్లం పొడి వేడి వేడి పాలల్లో కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే ఎక్కువసేపు మాట్లాడటం వలన వచ్చే గొంతు బొంగురు తగ్గుతుంది.పటికబెల్లం పొడి నిమ్మపండు ముక్క మీద కొద్దిగా అద్ది బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు మాయమవుతాయి.
పటికబెల్లం ముక్కను కొద్దిగా నీళ్లతో అరగదీయగ వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట రాసి మర్దన చేస్తూ ఉంటే 6 నిమిషాల్లో తేలు విషం హరించబడుతుంది.ఎండాకాలం లో పటిక బెల్లం పొడిని నీటి లో వేసుకుని తాగితే అతి దాహం తగ్గడం తో పాటు వడదెబ్బ తగలదు.