అమరావతి, ఏప్రిల్ 4: శ్రీశైలంలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కైలాసగిరి స్వామీజీ గురువారం రాత్రి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆశీర్వదించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలన్నీ నెరవేరాలని స్వామిజీ ఆశీర్వదించారు.
తన శిష్యులతో అమరావతి సందర్శనార్థం వచ్చిన స్వామిజీ ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబుకు అశీర్వచనాలు అందజేశారు.
శ్రీశైలం అక్కమహాదేవిగుహల్లో ఉన్న శంకర మఠంలో లోక కల్యాణం కోసం కొంత కాలంగా స్వామిజీ యాగం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, సుపరిపాలన కొనసాగాలని స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు.