బిగ్ బాస్ రియాల్టీ షోలో …హోస్ట్ గా రెండోసారి నాగార్జున ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు. సీజన్ త్రీ లో ఏ విధంగా అలరించారో అదేరీతిలో.. సీజన్ ఫోర్ లో రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో మొదటి నుండి అమ్మాయిల గుండెల్లో మన్మధుడుగా పేరొందిన నాగార్జున… బిగ్ బాస్ స్టేజీపై కొన్ని కొన్ని సందర్భాలలో వ్యవహరిస్తున్న తీరుకు సోషల్ మీడియాలో విమర్శలతో పాటు ట్రోలింగ్ వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల నోయల్ ఇంటి నుండి వెళ్లినా సందర్భంలో నాగార్జున వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు విమర్శలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. నోయల్ స్టేజ్ పైకి వచ్చిన సమయంలో దగ్గరకు… వస్తున్న క్రమంలో.. నాగార్జున సోషల్ డిస్టెన్స్ అంటూ నోయల్ ని దూరం పెట్టడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నేను షూటింగ్కి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వఛా కాబట్టి డిస్టెన్స్ పాటిద్దాం అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాగార్జున నిరాకరించడం పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.
విషయంలోకి వెళితే దసరా ఎపిసోడ్ సమయంలో నాగార్జున యాంకరింగ్ చెయ్యని క్రమంలో సమంత హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో ఇంటినుండి దీవి ఎలిమినేట్ అవ్వటం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వైల్డ్ డాగ్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో దివితో నాగార్జున క్లోజ్ గా ఉండే ఫోటో దిగటం అది సోషల్ మీడియాలో రావడంతో… మరి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ గుర్తు రాలేదా కింగ్ నాగార్జున అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఒకలా, అబ్బాయిల విషయంలో మరోలా నాగ్ వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎవర్గ్రీన్ మన్మధుడు నాగార్జున అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ మరికొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.