బిగ్బాస్ ఇంటి లోకి ప్రవేశించిన సినీతార మోనాల్ గజ్జర్ మూడు నెలల్లోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఆరు తెలుగు సినిమాల్లో నటిస్తే రాని గుర్తింపు ఒక బిగ్గెస్ట్ రియాల్టీ షో లోనికి వెళ్ళిన తర్వాత ఆమె సొంతం అయింది. అంతే కాకుండా అక్కడ అఖిల్ తో ఆమె సాగించిన ప్రేమాయణం బాగా క్లిక్ అయింది. ఫైనల్స్ జరిగిన తర్వాత అతనితో ఒక లైవ్ షో లో పాల్గొన్న ఆమెకు ఈ సమయంలో అఖిల్ కుటుంబ సభ్యులు ఝలక్ ఇవ్వడంతో ఖంగుతింది అనే చెప్పాలి.
పూర్తి వివరాల్లోకి వెళితే… బిగ్బాస్ ఇంటిలో అఖిల్, మోనాల్ చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచే వారు. ఇక అక్కినేని నాగార్జున కూడా వీరిని ఇన్ డైరెక్టుగా ఆటపట్టిస్తూ ఉంటాడు. దీంతో ఈమెకు అఖిల్ కి మధ్య ప్రేమ ఉందని అందరి మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాత వీరు కూడా కౌగిలింతలతో ముద్దులతో హైలెట్ అయ్యారు. ఇక ఆదివారం గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత యాంగ్రీ యంగ్ మాన్ అఖిల్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత అందరు ఇంటర్వ్యూల తో బిజీ అయిపోయారు.
ఇక లైవ్ లో మాట్లాడుకుంటూ అఖిల్ తన ఇంటికి రావాలి అని మొనాల్ ను పిలిచాడు. అప్పుడు నువ్వు నాకు లొకేషన్ పంపించావా…? అసలు కాల్ చేస్తే రిప్లై ఇచ్చావా అని ప్రశ్నించింది. నువ్వెప్పుడూ కాల్ చేశావ్ అని అఖిల్ అని అడిగాడు. వెంటనే నేను చేశాను…. మీ ఇంట్లో వారు మాట్లాడారు అని మోనాల్ చెప్పింది.
కుటుంబ సభ్యులు కూడా నిజమే అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. అంటే మోనాల్ ఫోన్ చేసినప్పటికీ అతని కుటుంబ సభ్యులు ఆ విషయం చెప్పలేదు. ఈ విషయం లైవ్ లోనే ఒప్పుకున్నారు. అంటే వీరిద్దరూ క్లోజ్ గా ఉండడం అఖిల్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని కూడా అనుమానాలు మొదలయ్యాయి.