సీనియర్ రాజకీయవేత్త మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎల్లుండి జరగవలసిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న వాయిదా పడడం పై స్పందించిన బొత్స చంద్రబాబు కుట్రపూరితంగా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా కోర్టు స్టే ఆర్డర్లను నుండి తీసుకుని వచ్చారని ధ్వజమెత్తారు.
ప్రతీ పేదవాడు అతను చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారని… మరియు అతని హయాంలో కనీసం ఒక్క ఇంటి నిర్మాణం అయినా జరిగిందా అని ప్రశ్నించారు. ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడవచ్చు కానీ ఆ ప్రక్రియ మాత్రం కచ్చితంగా చేసి తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ అన్నారు.
ఇకపోతే చంద్రబాబు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలు ప్రతి పేదవాడికి తీరని అన్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.